Roja : ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్తో టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. త్వరలో నారా లోకేష్ అరెస్ట్ కూడా జరగనుందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో నారా బ్రాహ్మణి, భువనేశ్వరి జోరు పెంచారు. వైసీపీ నాయకులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తో పాటు భువనేశ్వరి, బ్రహ్మణిలపై పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. విజయవాడలోని తుమ్మలపల్లిలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఆర్కే రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి రోజా.. చంద్రబాబు, లోకేష్ సహా భువనేశ్వరి, బ్రహ్మణిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నారా లోకేష్ రాష్ట్రపతిని కలిసిన అంశంపైనా మంత్రి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేష్ ఏనాడూ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవని.. తప్పు చేసిన తన తండ్రిని కాపాడుకోవడానికి మాత్రం కలిశారని సెటైర్ వేశరు. లోకేష్ ఢిల్లీలో మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకోవడానికి తెగ తిరుగుతున్నాడని.. కానీ, అడ్డంగా దొరికిన నారా చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరని మంత్రి రోజా పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా కనీసం లోకేష్ కు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల సొమ్ము దోచుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవద్దా అంటూ పర్యాటక శాఖ మంత్రి మండిపడ్డారు.
భువనేశ్వరి, బ్రాహ్మణి అబద్ధాలు చెప్తుంటే ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతుందంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కె రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు టీమ్ వర్క్ గా కుటుంబసభ్యులంతా దోపిడీలో భాగస్వామ్యం అయినట్టు ప్రజలకు స్పష్టమైందని మండిపడ్డారు. 6 నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేష్ చెబుతుంటే అందరూ నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. ఎర్ర బుక్ లో రాసుకుంటానని బెదిరిస్తున్న నారా లోకేష్.. సీఐడీ మెమోలో ఆయన పేరు రాశారని గుర్తు ఉంచుకోవాలని చెప్పుకొచ్చారు. హెరిటేజ్ లో 2 శాతం షేర్లు అమ్మితేనే 400 కోట్లు వస్తాయని భువనేశ్వరి చెబుతున్నారని.. అంటే చంద్రబాబు ఆస్తి 20 వేల కోట్లా అని ఆర్కే రోజా నిలదీశారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…