Revanth Reddy : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తెలుగు ప్రజలు ఉండే ప్రతిచోట.. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వవ్యాప్తంగా చంద్రబాబుకు మద్దుతు నిలుస్తూ నిరసనలు చేపడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్పై దేశంలోని వివిధ పార్టీలకు చెందిన ఎందరో ప్రముఖ రాజకీయ నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ అభిప్రాయాలను మీడియా, సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, రేణుకా చౌదరి, మధుయాష్కీ గౌడ్తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా బాబు అరెస్ట్ను ఖండించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కొందరు వ్యాఖ్యానించారు. కానీ గతంలో టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసి బాబుకు నమ్మకస్తుడిగా గుర్తింపు పొందిన రేవంత్ నోరు మెదకపోవడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. ఈ క్రమంలో ఎట్టకేలకు చంద్రబాబు అరెస్ట్పై తొలిసారి రేవంత్ రెడ్డి స్పందించారు. గాంధీభవన్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఒక రిపోర్టర్ చంద్రబాబు అరెస్ట్ గురించి రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తావించాడు.
బాబు అరెస్ట్ను ఎలా చూస్తారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. రేవంత్ స్పందించేందుకు ఆసక్తి చూపలేదు. ఎట్ల చూస్తలేమని, ఎట్ల జరుగుతుందో అట్లనే చూస్తున్నామంటూ తెలిపారు. అరెస్ట్ చేసినట్లే చూస్తున్నామని సమాధానమిచ్చారు. బాబు అరెస్ట్ గురించి స్పందించేందుకు రేవంత్ ఆసక్తి చూపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, అరికెపూడి గాంధీ స్పందించారు. ఇక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, కె.లక్ష్మణ్ కూడా బాబు అరెస్ట్ అక్రమమని ఆరోపించారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాబు అరెస్ట్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో స్వయంగా పాల్గొనగా.. తాను కూడా నిరసనల్లో పాల్గొంటానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…