Revanth Reddy : తెలంగాణ ఎన్నికలకి ఎంతో సమయం లేదు. దీంతో ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ఎవరికి తగ్గట్టు వారి మ్యానిఫెస్టో ఇస్తున్నారు. అయితే తాము అధికారంలోకి వస్తే గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు (గృహజ్యోతి) ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఉచిత విద్యుత్తు కావాలంటే ఇంట్లో ఒక్కటే కరెంటు బుగ్గ ఉండాలని, ఒక్కటే ఫ్యాన్ ఉండాలని, ఒక్కటే టీవీ ఉండాలని కాంగ్రెస్ నేత ఒకరన్నారు. కర్ణాటకలో ఇలాంటి ప్రచరాలే చేసి వారు నరకం అనుభవించేలా చేస్తున్నారు. ఇక్కడ మాత్రం వారిని ఎవరు నమ్మేలా లేరని యాంటీ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఇంటిలో అయినా ఒకటే బల్బు, ఒకటే ఫ్యాన్ ఉండటం అసాధ్యం. సింగిల్ బెడ్రూం ఇంట్లో అయినా కనీసం మూడు లైట్లు ఉంటాయి. రెండు ఫ్యాన్లు ఉంటాయి. ఇక టీవీ, ఫ్రిజ్ కూడా సాధారణమే. ఇవి లేని కుటుంబాలు ఒకటిరెండు శాతం కూడా ఉండవు. ఈ లెక్కన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్న గృహజ్యోతి పథకం ఏ ఇంటికీ వర్తించదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 200 యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్తూ.. ఇలా కండిషన్లు పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీది పచ్చి మోసం అని ప్రజలు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ వాళ్లు 3 గంటల కరెంట్ ఇస్తామని, 10 హెచ్ పీ మోటార్స్ పెట్టుకోవాలని అంటున్నారు. కాని అదెలా సాధ్యం. ఇప్పుడు 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారు. 5 హెచ్పీ మోటర్లు పెట్టుకొని, మంచిగా పంటలు పండించుకుంటున్నాం. అట్లకాదని 10 హెచ్పీ మోటర్లు పెట్టుకొని, 3 గంటల కరెంట్తో పంటలు పండించుకోలేం. 10 హెచ్పీ మోటర్తో ట్రాన్స్ఫారంపై లోడ్ పడుతుంది. స్టార్టర్లు, మోటార్లు కాలిపోతాయి. దానికి పెద్ద రూటర్, పెద్ద షాఫ్ట్ ఉంటుంది. ఏదన్నా ప్రాబ్లం వచ్చి బయటకు తీయాలంటే కూడా ఇబ్బందే. 3 గంటల కరెంట్, 10 హెచ్పీ మోటార్లతో వ్యవసాయం జరుగదు. ఇచ్చినా మాకు వద్దు. ఇది రైతులకే కాదు ప్రభుత్వానికీ భారమే.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…