Rashmi Gautam : రష్మీ గౌతమ్.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటిగా, యాంకర్గా ఎప్పుడు సత్తా చాటుతుంది రష్మి. ఓ వైపు బుల్లితెరపై యాంకర్గా రష్మి గౌతమ్ తన శైలిలో దూసుకుపోతూనే.. మరోవైపు వెండితెరపై కూడా తళుక్కుమంటూ ఉంటుంది రష్మీ.ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎన్నో విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. రష్మీ తనపై వచ్చే విమర్శలకు ధీటుగా సమాధానం చెబుతుంటుంది. ఈ అమ్మడు మూగ జీవాలపై ప్రేమను వ్యక్తం చేస్తుంటుంది. ఇటీవల అంబర్ పేటలో ఓ చిన్న పిల్లాడిని వీధి కుక్కలు చంపేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె విచారణ వ్యక్తం చేస్తూనే వీధి కుక్కలను పునరావాసం కల్పించాలని కోరింది. దీంతో రష్మీ నెటిజన్స్ ట్రోల్స్ బారిన పడుతుంది.
రీసెంట్గా ఓ నెటిజన్ తీవ్రంగా బెదిరించాడు. ఆమెపై యాసిడ్పోస్తానంటూ.. చేతబడి చేయిస్తానంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఆ మెసేజ్ స్క్రీన్షాట్ను ఆమె ట్వీట్ చేసింది. ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేయాలా అంటూ నెటిజన్ల సలహా కోరింది. 40 ఏళ్లు వచ్చేస్తున్నాయి. లేట్ చేయకుండా పెళ్లి చేసుకో. నీ మీద చేతబడి చేయిస్తా పాపిష్టిదానా, నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లోనే ఉండు. ఆవుల వల్ల యాక్సిడెంట్ అవుతుంది? యాసిడ్ పోస్తా.. వాటి గురించి నీలాంటి పాపిష్టి వాళ్లకి తెలియదు. అన్నీ మూసుకుని వుండు. మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావు’’ అంటూ రష్మీక పలు హెచ్చరికలు జారీ చేశారు.
అయితే రష్మీ రీసెంట్గా కుక్కల కోసం పునరావాస కేంద్రాలు, వాటికి వ్యాక్సినేషన్, బర్త్ కంట్రోల్ వంటివి చేయడం వల్ల ఇలాంటి ఘటనలు తగ్గించొచ్చు అని, కేవలం కుక్కల వల్లే కాదు.. ఆవులు, మేకలు ఇలాంటి వల్ల కూడా ప్రమాదాలు జరగొచ్చు అని రష్మీ చెప్పుకొచ్చింది. దీంతో కొందరు నెటిజన్లు రష్మీని పర్సనల్గా అటాక్ చేస్తున్నారు. రష్మీపై ఇలా విపరీతమైన ట్రోల్ జరగడం ఇప్పుడు కొత్తేమి కాదు. గతంలోను ఈ అమ్మడిపై ఇలా పలుమార్లు ట్రోలింగ్ నడిచింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…