Rajinikanth : తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వచ్చే చిత్రాలకు ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఉంది. రీసెంట్గా రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం విడుదల కాగా, ఈ మూవీ ఇండియా వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపించింది. ఫలితంగా గ్రాండ్గా విడుదలై భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. శుక్రవారం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్లు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్గా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 40 కోట్లు రాబట్టింది. ఇలా 2 రోజుల్లో దాదాపు రూ. 134 కోట్లు షేర్తో పాటు రూ. 260 కోట్లు గ్రాస్ను ఇది వసూలు చేసింది. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ మూవీని విడుదల చేశారు.
ప్రభాస్ కు ఎలాగూ తెలుగులో మంచి పాపులారిటీ ఉంది. ఎక్కువ కలెక్షన్లు వస్తాయి. అయితే మిగతా భాషల్లో కూడా అదేస్థాయిలో కలెక్షన్లు సాధించాలనే లక్ష్యంతో ప్రభాస్ ఉన్నారు. మరోవైపు ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. “కల్కి సినిమా అద్భుతంగా ఉంది. ఇండియన్ సినిమాను నాగ్ అశ్విన్ మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇందులో నటించిన వారికి ఈ సినిమాకు పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు. ఈ సినిమా రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అంటూ రజినీకాంత్ ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు దర్శకుడు నాగ్ అశ్విన్ రిప్లై ఇస్తూ “మాటలు రావడం లేదు సర్..టీమ్ అందరి తరపున కృతజ్ఞతలు” అని చెప్పారు.
ఇక అక్కినేని నాగార్జున సైతం మూవీపై ప్రశంసల జల్లు కురిపించారు. కల్కి టీమ్ అందరికీ అభినందనలు. నాగీ మీరు మమ్మల్ని మరోక స్థాయికి తీసుకెళ్లారు. పురాణాలు, చరిత్రను కలుపుతూ అల్లుకున్న అద్భుతమైన కల్పన కల్కి. అసలైన మాస్ హీరో అమితాబ్. మీరు నిప్పులు కురిపిస్తున్నారు. సీక్వెల్లో కమల్ సర్ ను చూడటానికి వేచి చూస్తున్నాను. ప్రభాస్ నువ్వు మరోసారి సత్తా చాటావు. దీపికా మీరు అద్భుతంగా నటించారు. మీరంతా కలిసి ఇండియన్ సినిమా స్థాయిని మరోసారి నిరూపించారు” అంటూ ప్రశంసించారు కింగ్ నాగార్జున. మొదటి పార్ట్ మంచి హిట్ కావడంతో రెండో పార్ట్ చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…