Radhika Merchant : అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ల పెళ్లి గురించి దేశమంతా చర్చ. వీరి ప్రీ-వెడ్డింగ్ వేడుకకు ప్రపంచ దిగ్గజాలు సైతం ప్రత్యేక విమానాల్లో ఇండియాకు తరలివచ్చారు. అనంత్, రాధిక.. చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులు. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్.. ఆ స్నేహం కాస్తా.. ప్రేమగా మారి.. పెళ్లి వరకు దారితీసింది. అంబానీ కోడలు రాధిక మర్చంట్ డిసెంబర్ 18, 1994న జన్మించారు. యువ వ్యాపారవేత్త, భరతనాట్యం నృత్యకారిణి. ఎన్కోర్ హెల్త్కేర్ వైరెన్ మర్చంట్ CEO మరియు ఎన్కోర్ హెల్త్కేర్ డైరెక్టర్ శైలా మర్చంట్ కుమార్తె. రాధికకు తన సోదరి అంజలి మర్చంట్తో విపరీతమైన అనుబంధం ఉంది.
ఆమె కేథడ్రల్ జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మొండియల్ వరల్డ్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఆమె బీడీ సోమాని ఇంటర్నేషనల్ స్కూల్ నుండి ఇంటర్నేషనల్ బాకలారియేట్ డిప్లొమాతో న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీని కలిగి ఉంది. చదువుతో పాటు.. ముంబైలోని శ్రీ నిభా ఆర్ట్స్ డ్యాన్స్ అకాడమీలో గురు భావన థాకర్ మార్గదర్శకత్వంలో ఎనిమిదేళ్ల పాటు భరతనాట్యంలో శిక్షణతో పాటు సాంప్రదాయ నృత్యంలో శిక్షణ పొందింది. అయితే ఆమె ప్రీ వెడ్డింగ్ వేడుకలో మాట్లాడిన మాటలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అనంత్ మాట్లాడిన తర్వాత అంబానీ ఫ్యామిలీకి కాబోయే కోడలు రాధికా మర్చంట్ కూడా మాట్లాడింది. చేతిలో ఎలాంటి నోట్ లేకుండా ఆమె అనర్గళంగా అనంత్ గురించి ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆహా అనిపించాయి. కానీ, ఆమె మాట్లాడిన మాటలు ఓ హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టారంటూ ఓ నెటిజన్ వీడియో షేర్ చేశాడు. 2004లో వచ్చిన హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టారని కామెంట్ చేశాడు. ‘షెల్ వియ్ డ్యాన్స్’ అనే సినిమాలో సుసాన్ సారండన్ మాట్లాడిన మాటలనే ప్రీ వెడ్డింగ్ వేడుకలో రాధిక చెప్పినట్లు వివరించాడు. ఇద్దరి మాటలు ఒకేలా ఉండటంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…