Prudhvi Raj : ఏపీలో ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.ఏదో ఒక అంశంలో దారుణంగా విమర్శించుకుంటున్నారు. అయితే వైసీపీ నుండి బయటకు వచ్చి జనసేనలో చేరిన పృథ్వీరాజ్ రీసెంట్గా సంచలన వ్యాఖ్యలు చేశారు.. రోజాకు అహంకారం ఎక్కు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకుల నోర్లు ఫినాయిల్తో కడిగిన మారవని, మంచి మాట్లాడిన చెడుగా అర్థం చేసుకుంటారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాల్లో టీడీపీ – జనసేన కూటమి అద్భుతమైన విజయం సాధిస్తుందని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు.
విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగిన సభ ప్రభుత్వం ప్రమాణ స్వీకార సభల మారిందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాట ప్రజలకు చేరువైందన్నారు. వైసీపీ నాయకుల నోర్లు ఫినాయిల్తో కడిగిన మారవని, మంచి మాట్లాడిన చెడుగా అర్థం చేసుకుంటారని విమర్శించారు. “నిజంగా 175కు 175 సీట్లు వైసీపీకి వచ్చే పరిస్థితి ఉంటే 92 స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు ఎందుకోసం అని పృథ్వీరాజ్ ప్రశ్నించారు.. వచ్చే ఎన్నికలతో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. బలిజ ఐక్యత ఎలా ఉంటుందో రానున్న ఎన్నికల ఫలితాలతో నిరూపితం అవుతుంది. అధికార పార్టీ నాయకులు ఎన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన కవ్వింపులకు దిగినా ఆవేశాలకు లోను కావద్దు.
వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నా నేను సిద్ధంగా ఉన్నా. అంబటి రాంబాబు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే జబర్దస్త్ షోలకు పనికి వస్తాడు. రోజాకు అహంకారం ఎక్కువ. ఎన్నికల నోటిఫికేషన్ రావడమే ఆలస్యం అధికార పార్టీ నుంచి జంపింగ్లు ఎక్కువగా ఉంటాయి.” అని పృథ్వీరాజ్ జోస్యం చెప్పారు.కాగా, జగన్ పాదయాత్రలో సినీ నటుడు పృథ్వీరాజ్ మద్దతుగా నిలిచారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఆయనకు ఎస్వీబీసీ ఛైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో వచ్చిన ఆరోపణలతో ఆయన్ను తప్పించారు. తరువాతి కాలంలో పృథ్వీరాజ్ జనసేనలో చేరారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దమని..తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేస్తానని గతంలో ప్రకటించారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…