Prabhas : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ మంచి హిట్ అందుకోవాలని తహతహలాడుతున్నాడు.బాహుబలి తర్వాత ప్రభాస్ ఖాతాలో వరుస ఫ్లాపులు వచ్చి చేరాయి. దీంతో ఇప్పుడు ఆయన నుండి వస్తున్న సలార్ మంచి హిట్ కావాలని అందరు కోరుకుంటున్నారు. డార్లింగ్ బిగ్ ప్రాజెక్ట్స్ తో అదరగొడుతున్నారు. ఇందులో సలార్ ఒకటి కాగా, డార్లింగ్ మాస్ విశ్వరూపాన్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ చేతిలో పలు సినిమాలు ఉండగా, అవి కూడా భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నాయి.
ఈశ్వర్ సినిమా ద్వారా కృష్ణంరాజు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక ప్రభాస్ సత్యానంద్ గారి వద్ద శిక్షణ తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే తాజాగా సత్యానంద్ గారి పుట్టినరోజు కావడంతో ప్రభాస్ తన గురువు గారికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ సత్యానంద్ గారి వద్ద శిక్షణ తీసుకొని ఈశ్వర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా నటనలో తనని తాను నిరూపించుకుంటూ నేడు పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ఈయన పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ తన మూలాలను మర్చిపోలేదని చెప్పాలి. ప్రభాస్ తనకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినటువంటి తన గురువు గారి పుట్టినరోజు కావడంతో ఈయన తన గురువు కోసం ఏకంగా పూర్తి బంగారంతో తయారు చేస్తున్నటువంటి చేతి వాచ్ ను తనకు కానుకగా ఇచ్చారు.
ప్రభాస్ స్వయంగా తన గురువు వద్దకు వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా తానే సత్యానంద్ చేతికి వాచ్ తొడిగారు.అంతేకాదు ఈ వాచ్ మీకు నచ్చిందా గురువుగారు అంటూ ఎంతో ఆప్యాయంగా అడిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ఎంతో ఎత్తుకు ఎదిగిన తన అనుకున్న వారి పట్ల ఎప్పుడు ఇలాంటి ప్రేమను చూపిస్తూ ఉంటారంటూ కామెంట్లు చేస్తున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…