Perni Nani : ఇటీవల నారా లోకేష్ సమక్షంలో టీడీపీ నాయకులు.. వైసీపీ ప్రజా ప్రతినిథులపై దారుణమైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పేర్ని నాని తాజా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చంద్రబాబుతో పాటు నారా లోకేష్పై మండిపడ్డారు.నారా లోకేష్ పాదయాత్ర ఎలా చేయాలో దివంగత నేత రాజశేఖరరెడ్డి పాదయాత్ర, లేదేంటే జగన్ వీడియోలు చూస్తే అర్థమవుతుందని అన్నారు. యువగళం పేరుతో లోకేష్ రాత్రుళ్లు పాదయాత్ర చేస్తున్నాడు. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించి తెల్లవారుజామున ఒంటి గంట వరకు తిరుగుతున్నాడు.యువగళమా? యువ గంగాళమా?. పగలైతే ప్రజలు నిలదీస్తారని అర్థ రాత్రుళ్లు తిరుగుతున్నాడా?? అని ప్రశ్నించారు.
యువగళం వల్ల పేదలకు కొంచెం మంచి జరుగుతోంది. యువగళానికి వచ్చినందుకు ప్రజలకు వెయ్యో, రెండు వేలో వస్తున్నాయి. గన్నవరంలో సభ పెట్టి ముఖ్యమంత్రిని, మా నాయకులను నోటికి వచ్చినట్లు బూతులు తిట్టారు. జుగుప్సాకరంగా, అసహ్యంగా మాట్లాడటమే టీడీపీ నాయకుల రాజకీయం’’ అని పేర్ని నాని నారా లోకేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర ఎలా చేయాలో వైఎస్ పాదయాత్ర వీడియోలు చూస్తే తెలుస్తుందని.. జగన్ ఇష్తున్న పథకాలకు పేరు మార్చి ఇస్తామంటున్నారని పేర్ని నాని మండిపడ్డారు. లోకేష్ తోలు తీస్తా, తాట తీస్తా అంటున్నారని.. అలాంటి వారికి అధికారం ఇవ్వాలా అని మాజీ మంత్రి ప్రశ్నించారు.
![Perni Nani : ఛీ.. కొడతారని రాత్రిళ్లు యువగళం పాదయాత్ర చేస్తున్నాడంటూ లోకేష్పై సెటైర్స్.. Perni Nani sensational comments on nara lokesh padayatra](http://3.0.182.119/wp-content/uploads/2023/08/perni-nani-2.jpg)
కప్పులు కడిగేవాడంటే ఇప్పటికీ చంద్రబాబు ప్యాంటు ఎందుకు తడుస్తోందని పేర్ని నాని దుయ్యబట్టారు. మోడీ కప్పులు కడగలేదా అని పేర్ని నాని ప్రశ్నించారు. ఓట్ల కోసం లారీ డ్రైవర్ల భుజాలపై చేతులు వేసి మాట్లాడుతున్నారని.. ఇది పెత్తందారి స్వభావం కాదా అని ఆయన నిలదీశారు. గుడివాడలో తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్ధి లేరని.. లోకేష్కు దమ్ముంటే అక్కడ పోటీ చేయాలని పేర్ని నాని సవాల్ విసిరారు. లోకేశ్ అసమర్ధత కారణంగా చంద్రబాబు పవన్ కల్యాణ్ను తెచ్చుకోవాల్సి వచ్చిందని చురకలంటించారు.