Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే మరోవైపు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో విశాఖపట్నంలోని దసపల్లా హోటల్లో జనసేన జనవాణీ కార్యాక్రమం కొనసాగుతుండగా, పవన్ కళ్యాన్ను దివ్యాంగులు కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను బాధితులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో న్యాయం చేస్తానని దివ్యాంగులకు జనసేనాని హామీ ఇచ్చారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. అంగవైకల్యం కంటికి కనిపిస్తున్నా… సర్టిఫికెట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.
అయితే సర్టిఫికెట్ ఉన్నప్పటికీ ప్రభుత్వ నుంచి ఆర్ధిక సహాయం అందడం లేదని వారు వాపోయారు. సర్టిఫికెట్ లేని వారు అనేక మంది ఉంటున్నారని.. సర్టిఫికెట్ ఉన్నా కొందరికి న్యాయం జరగడం లేదన్నారు. దివ్యాంగులకు చట్టం ఉందని, అది అమలు కావడం లేదని తెలిపారు. దివ్యాంగులకు ఇబ్బంది పెట్టేవారిని శిక్షించే చట్టం రావాలన్నారు. ప్రభుత్వం కూడా 3 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని జనసేనాని మండిపడ్డారు. సమాజంలో ఇలాంటి వారిని ఆదుకునే వారు ముందుకు రావాలని కోరారు. తాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దివ్యాంగులను గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు.
ప్రభుత్వం దివ్యాంగుల దగ్గరికి వచ్చేలా చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు విదేశాల్లో దివ్యంగులను అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేకంగా చూస్తాయన్నారు. ఆత్మ నూన్యత భావం ఉండకూడదనే అనుకుంటానని తెలిపారు. ఎన్డీఏ మీటింగ్కు వెళ్ళినప్పుడు ప్రధానమంత్రితో మాట్లాడి న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అందరిని ఎడ్యుకేట్ చేసే బాధ్యత తీసుకుంటానని పవన్ చెప్పార. అప్పు సోప్పో చేసైనా అదుకుంటానని మాటిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమాలు చేసే పని లేకుండా చేస్తానన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు లోన్లు ఇచ్చి ఆదుకుంటానని పవన్ తెలియజేశారు.ఇక పిల్లలని పలకరిస్తూ స్వామియే శరణమయ్యప్ప అని పాటని పాడారు. అలానే పాట పాడాలని అన్నారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించారు పవన్.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…