Pawan Kalyan : గత కొద్ది రోజులుగా సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టారు. నేటి నుండి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు కానుంది. పలు ప్రాంతాలలో అనేక బహిరంగ సభలు ఏర్పాటు చేస్తుండగా, అక్కడ పవన్ ప్రసంగించనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాలపై కూడా ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే డిసెంబర్లోనే ఏపీ , తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని అన్నారు. జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై యువత ముందుకు వస్తున్నారని, తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో బాధ్యతలు అప్పగించామన్నారు.
ప్రజల అభిమానం సంపాదించుకోవడం కష్టంతో కూడుకున్న పని, ప్రతి ఒక్కరూ ఐడెంటిటీని కాపాడుకోవాలన్నారు. భవిష్యత్తులో జనసేన పార్టీ చాలా బలమైన పార్టీగా ఎదుగుతుందన్నారు. తాను ఆశామాషిగా రాజకీయం చేయడానికి రాలేదని అన్న ఆయన.. సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. . తెలంగాణలో కూడా పార్టీ కార్యకలాపాలు విస్తరించాలని నేతలకు సూచించారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు ఉండదని ఒంటరిగా ఎన్నికలకు సిద్ధమవ్వాలని ఆయన నేతలకు సూచించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడలో ప్రజానీకానికి జనసేన అండగా నిలవాలని పవన్ సూచించారు.
ప్రత్యేక తెలంగాణ కోసం దాదాపు 1300 మంది ఆత్మబలిదానాలు చేశారని.. వాళ్ల ఆకాంక్షలు, నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ యువతకు అందకపోతే ప్రత్యేక రాష్ట్రం సాధించి నిష్ప్రయోజమన్నారు. ఊరికి పదిమంది బలంగా నిలబడటం వల్లే ఈ రోజు ప్రత్యేక తెలంగాణ సాకారం అయ్యిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా చాలా మంది అక్కడికి వస్తున్న నేపథ్యంలో లోకల్గా ఉన్నవాళ్లకి ఉద్యోగాలు దొరకడం లేదని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందకపోవడం వల్లనే ఇక్కడి వారు కూడా హైదరాబాద్కి తరలి వెళ్తున్నారని రానున్న రోజులలో అలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటానని తెలియజేశారు పవన్.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…