Pawan Kalyan : ప్రస్తుతం ఏపీ ప్రజలు వరదలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.ఇదే సమయంలో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. విజయవాడ ప్రాంతం వరదలతో కొట్టుకుపోతుంటే తాను కనిపించడం లేదని వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. వరద ప్రభావ ప్రాంతాలకు తాను వెళ్లి పాల్గొంటే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని, అధికారులపై ఒత్తిడి పెరుగుతుందన్న ఉన్నతాధికారుల సూచనలతో తాను వెళ్లలేదని స్పష్టం చేశారు. బుధవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన డీసీఎం పవన్ కల్యాణ్ వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు.
విపత్తు పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఈ వయసులో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ట్రాక్టర్లు, జేసీబీలల్లో ఎక్కి వరద ప్రాంతాల్లో సంచరించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారని, ప్రతి ఒక్కరు ఆయన అభినందించాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. తాను వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లడం లేదని వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై డీసీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తాను వరద ప్రాంతాలకు వెలితే సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని అధికారులు చెప్పారని, అందుకే తాను ఆ ప్రాంతాలకు వెళ్లలేదని డీసీఎం పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. అందుకే తాను ప్రాంతాలకు వెళ్లలేదని పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మీరు పర్యటించి ఆ తర్వాత తనపై విమర్శలు చేయాలని డీసీఎం పవన్ కల్యాణ్ వైసీపీ నాయకుల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.

వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాలంటే మిమ్మల్ని తన కాన్వాయ్ లో స్వయంగా తానే పిలుచుకొని వెలుతానని, ఆ తర్వాత ఆ ప్రాంతాలు పరిశీలించింది తనకు సలహాలు ఇవ్వాలని పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ జిల్లా వరదల కారణంగా ఎక్కువగా దెబ్బతిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విపత్తు సమయంలో అందరం కలిసి ప్రజల్ని ఆదుకోవాలి. ముందు వైసీపీ సహాయంచేసి అప్పుడు మాపై విమర్శలు చేయండి. ఇళ్లలో కూర్చొని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరైంది కాదని వైసీపీ నేతల తీరును పవన్ విమర్శించారు.