Pawan Kalyan : గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.ఈ క్రమంలోనే ఈయన వారాహి యాత్ర ను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. రీసెంట్గా కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పర్యటించగా, ఈ యాత్రలో భారీగా యువకులు, పవన్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక పర్యటనలో పవన్ యువతని ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సినిమా వేరు, రాజకీయం వేరు అని చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్.. సినిమా పరంగా రాష్ట్రంలోని యువత ఏ హీరోని అయినా ఇష్టపడడంలో తప్పులేదని అన్నారు.
అయితే రాష్ట్ర ప్రయోజనాలు దగ్గరకి వచ్చేపాటికి యువత ఆలోచించాల్సి ఉంటుందని గుర్తు చేశాడు. తన తోటి నటీనటులు అంటే తనకెంతో గౌరవం ఉందని, వారి సినిమాలను కూడా చూస్తానని వెల్లడించిన పవన్.. రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ , ప్రభాస్ , చిరంజీవి అంటే తనకి ఇష్టమని చెప్పుకొచ్చాడు. అంతేకాదు వారి సినిమాలను కూడా తాను చూస్తాను అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ టాలీవుడ్ హీరోల గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈయన ఒకవైపు వారాహి యాత్ర చేపడుతూనే మరోవైపు సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.
![Pawan Kalyan : ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ని పవన్ కళ్యాణ్ ఎలా అడుగుతున్నాడో చూడండి...! Pawan Kalyan requesting jr ntr and prabhas fans](http://3.0.182.119/wp-content/uploads/2023/06/pawan-kalyan-1-3.jpg)
వారాహి యాత్ర పర్యటనలో పవన్ కళ్యాణ్ ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అయితే ఈ యాత్రలో రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్.. ఒక్కోసారి సినిమా సంగతుల గురించి కూడా పలు విషయాలు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్ ,, హరి హర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ మూవీ పూర్తి చేయడానికి ఆయా సినిమా నిర్మాతలు పవన్ ఎక్కడ ఉంటే అక్కడ షూటింగ్స్ జరిపేలా చర్యలు తీసుకుంటున్నారు.