Pawan Kalyan : సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి పెట్టారు. వారాహి విజయ యాత్ర అంటూ పలు చోట్ల సభలు నిర్వహిస్తున్నారు. నిన్న కాకినాడ జిల్లా పిఠాపురంలో యాత్ర చేసిన పవన్ కళ్యాణ్ ఒక్కసారి జనసేనకు అధికారం ఇచ్చి చూడాలనీ, ఏపీని దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతానని అన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఏ వ్యూహమైనా వేస్తానన్నారు పవన్ కళ్యాణ్. “పిఠాపురం సాక్షిగా.. దత్తాత్రేయుడి సాక్షిగా అడుగుతున్నా.. నాకు అధికారం ఇవ్వండి. మిమ్మల్ని అర్థిస్తున్నా.. నన్ను సీఎంను చేయండి” అని పవన్ విజ్ఞప్తి చేయడం విశేషం.
తనకు క్రిమినల్స్ అంటే చిరాకు అన్న పవన్ కళ్యాణ్.. “నేరాలు చేసి రాజకీయాల్లోకి వచ్చిన వీళ్లా మనల్ని పాలించేది. గూండాగాళ్లు, రౌడీలు, హంతకులు.. సిగ్గుండాలి మనకు ఇలాంటి వాళ్లు పాలించేలా చేసుకోవడానికి అని ఆవేశంగా విరుచుకుపడ్డారు పవన్. అలానే తన రెండు చెప్పులు ఎవరో తీసుకెళ్లారని, వారెవరైన కనిపిస్తే చెప్పండి పవన్ కళ్యాణ్ కామెడీ కూడా చేశారు. పుట్టిన నేల సాక్షిగా చెబుతున్నాను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
మరోసారి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వస్తె ఎవరినీ బతకనివ్వరు. ప్రతి ఇంట్లోకి వైసీపీ గుండాలు వచ్చి దోచుకుంటారు. హంతకులు.. గుండాలు.. రౌడీలు.. అవినీతి పరులతో వైసీపీ ప్రభుత్వం నిండిపోయింది. వైసీపీ పార్టీ గుండాలకు నిలయం. ప్రతి వైసీపీ గూండాగాళ్లను బట్టలు ఊడదీసి నడి రోడ్డుపై ప్రజలతో కొట్టించే రోజు దగ్గర్లోనే ఉంది. క్రిమినల్ మైండ్ ఉన్న వారు పాలిస్తే క్రిమినల్స్ కు వత్తాసు పలకకుండా ఏం చేస్తారు. రాష్ట్రంలో ఆడబిడ్డ బయటకు వెళ్తే మళ్లీ సురక్షితంగా ఇంటికి వస్తుందా లేదా అనే భయం అందరిలోనూ ఉంది అని పవన్ కళ్యాణ్ అన్నారు.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…