Pawan Kalyan : ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇక మీరు మారరా అంటూ ఫైర్..

Pawan Kalyan : జ‌న‌సేనాని ప‌వన్ క‌ళ్యాణ్ గ‌త కొద్ది రోజులుగా వైసీపీని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌తో పాటు ఏపీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై జ‌నసేనాని గట్టిగా త‌న వాద‌న వినిపించారు. అయితే తాజాగా ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. బైజూస్ సంస్థతో చేసుకున్న ఒప్పందం విషయంలో సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మెగాడీఎస్సీని ప్రకటించలేదని.. ఒక్కరంటే ఒక్క టీచర్ నూ రిక్రూట్ చేయలేదని మండిప‌డ్డారు. కానీ తీవ్ర నష్టాల్లో ఉన్న ఓ స్టార్టప్‌కు మాత్రం వందల కోట్లు కాంట్రాక్టులు ఇచ్చారన్నారు.

బైజూస్‌కు కాంట్రాక్టులు ఇచ్చే విషయంలో స్టాండర్డ్ ప్రోటోకాల్ ను వైసీపీ ప్రభుత్వం పాటించిందా ? ఎన్ని కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి ? ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారు ? ఈ వివరాలన్నీ పబ్లిక్ డోమైన్‌లో ఉన్నాయా ? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వీటిపై వైసీపీ గవర్నమెంట్ స్పందించాలన్నారు. ఈ ట్వీట్ కింద ట్యాబ్స్ పంపిణీ మంచిదేనని, కానీ ముందు పాఠశాలల్లో టాయిలెట్లు నిర్మించాలన్నారు. అలాగే యాప్స్ ఛాయిస్ అని కానీ టీచర్లు తప్పనిసరి అని కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ కు పలు మీడియా క్లిప్స్ ను కూడా జత చేశారు.

Pawan Kalyan again angry comments on cm ys jagan
Pawan Kalyan

వీటిలో స్టార్టప్ కంపెనీ బైజూస్ 2021లోనే అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 17 రెట్లు నష్టాలు చవి చూసిందనే కథనం ఉంది. అలాగే బైజూస్ కు ట్యాబ్ ల పంపిణీ కోసం వైసీపీ సర్కార్ ఎంత చెల్లించిందనే వివరాలు కూడా ఉన్నాయి . కరోనా సమయంలో బైజూస్ ఆన్ లైన్ క్లాసులకు విపరీతమైన ఆదరణ లభించింది. దీంతో ఆ సంస్థ ఆర్థికంగా అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. అయితే సరైన క్వాలిటీ లేని ఆన్ లైన్ చదువులు.. స్కూళ్ల ప్రారంభం తర్వాత బైజూస్ పై అంతా పూర్తిగా నమ్మకం పోగొట్టుకున్నారు. దీంతో శరవేగంగా ఆ సంస్థ కూలిపోతోంది. బైజూస్ కంటెంట్ పై ఏ మత్రం సానుకూల ఫీడ్ బ్యాక్ లేకపోయినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీతో కనీసం రూ. ఏడు వందల కోట్ల రూపాయల ఒప్పందం చేసుకోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 hours ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

14 hours ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 day ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

4 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

4 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

4 days ago