Pavitra Lokesh : గత కొద్ది రోజులుగా టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిపోయారు నరేష్ – పవిత్ర లోకేష్. కొన్నాళ్లుగా వీరిద్దరు రిలేషన్లో ఉండగా, ఇటీవల మీడియా ముఖంగా తమ రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు. నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి పెద్ద గొడవే చేసింది. మీడియాకెక్కింది. ఇప్పుడు మూడో భార్య నుంచి విడిగా ఉంటున్న ఆయన పవిత్రా లోకేష్తో రిలేషన్లో ఉన్నారు. ఎక్కడకు వచ్చినా వీరిద్దరూ కలిసే వస్తున్నారు. దీంతో మీడియా అటెన్షన్ అంతా అటే పోతుంది. ఇలాంటి తరుణంలో వీరిద్దరూ జంటగా ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా తీసి ఇందులో నానా రచ్చ చేశారు. లిప్ లాక్ ఇచ్చుకోవడాలు, కలిసి రొమాన్స్ చేయడాలు వంటివి ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆశ్చర్యపరిచాయి.
‘ఆలయం’ సినిమా సమయంలో వీరిద్దరు మొదటి సారి కలుసుకోగా, మళ్లీ 10 ఏళ్లకు ‘హ్యాపీవెడ్డింగ్’ షూటింగ్ సమయంలో కలుసుకున్నారట. ఆ టైంలో నాతో గలగలా మాట్లాడుతూనే ఉంది. షూటింగ్ జరుగుతుండగానే నా గురించి చాలా విషయాలు తెలుసుకుంది. అప్పుడు నేను షాక్ అయ్యా. ఆ టైంలోనే ఈ అమ్మాయి బాగుంది, అందంగా ఉందనిపించి ఓ పాజిటివ్ ఎనర్జీ కలిగింది. ఇక షూటింగ్ అయిపోయాక మళ్ళీ నాతో మాట్లాడలేదు’’ అని నరేష్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే ‘సమ్మోహనం’ షూటింగ్లో అనుకోకుండా కలిశాం. అప్పటికే నాకు తనపై ప్రేమ పుట్టింది. తనే నాకు రైట్ పర్సన్ అనిపించింది. దాంతో వెంటనే డిన్నర్ కి తీసుకెళ్లి భోజనం చేశాక ‘ఐ లవ్ యు’ చెప్పేశాను. అప్పుడు ఆమె నుండి ఎలా రెస్పాన్స్ రాలేదు.
ఈ క్రమంలో డిసెంబర్ 31 రోజు విషెస్ చెబుదామని, తనకు గుడ్ న్యూస్ వస్తుందని ఆమె వద్దకు వెళ్ళాను. ఇప్పటికైనా చెప్పు అని అడిగితే అప్పుడు ‘ఐ లవ్ యు’ అని చెప్పింది” అని తన లవ్ స్టోరీ చెప్పుకొచ్చారు నరేష్. తాజాగా ఈ జంట టీవీ షోకి హాజరు కాగా, ఆ షోలో పవిత్ర లోకేష్.. నరేష్ బుగ్గ మీద ముద్దు పెట్టి అందరిని ఆశ్చర్యపరచింది. తమతో పాటు ఉన్న నటీనటుల ముందు, చుట్టు పక్కల కెమెరాల ముందే నరేష్కి ముద్దు పెట్టి అందరిని ఆశ్చర్యపరచింది. వీరిద్దరు కలిసి ఓ పాటకు డ్యాన్స్ కూడా చేశారు. మల్లెమాల సంస్థ రూపొందించిన స్వామి రా రా కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా వీరు రాగా, ఆ షోలో నరేష్ని తాను రాయ అని ముద్దుగా పిలుస్తాను అని పవిత్ర తెలిపింది. ఇక గతంలో నరేష్ మాట్లాడుతూ.. తాను పవిత్రని అమ్ములు అని పిలుచుకుంటాను అని తెలియజేశాడు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…