Patnam Mahender Reddy : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనేక పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో రాజకీయాలు ఊపందుకుంటుండడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.. ఇన్నాళ్ళ పార్టీ జాయింనింగ్స్పై మౌనంగా కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్లో కీలక నేతల చేరికలతో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయనే అంశం ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీకాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి హస్తం గూటికి చేరారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య బొంత శ్రీదేవి.. కాంగ్రెస్ కండువా కప్పుకొన్న వారిలో ఉన్నారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ప్రొఫెసర్ బానోత్ రమణ నాయక్ సైతం కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. కాంగ్రెస్లో చేరిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూరకంగా కలుసుకున్నారు. పట్నం సునీత మహేందర్ రెడ్డి ఈ ఉదయమే బీఆర్ఎస్కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్కు పంపించారు. రాజీనామా చేయడానికి గల కారణాలను వివరించారు.
ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశామని గుర్తు చేశారు. సరైన ప్రాధాన్యత దక్కట్లేదని పేర్కొన్నారు. పార్టీ, ప్రభుత్వపరంగా తనకు అవకాశాలను కల్పించింనందుకు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. రాజీనామా పత్రాన్ని పంపించిన కొద్దిసేపటికే ఆమె భర్తతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. చేవేళ్ల లోక్సభ సీటుపై హామీతోనే పట్నం సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరారనే వార్తలు వినిపిస్తున్నాయి. చేవేళ్ల నుంచి బీజేపీ, బీఆర్ఎస్ తరపున బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో.. కాంగ్రెస్ కూడా నియోజకవర్గంపై పట్టున్న పట్నం ఫ్యామిలీని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు దఫాలు చర్చలు జరిపిన పట్నం కుటుంబసభ్యులు ఎట్టకేలకు ఎంపీ సీటు కోసం లైన్ క్లియర్ కావడంతో సునీతా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…