Sonu Sood : కరోనా సమయంలో సోనూసూద్ పేరు ఎంతగా మారుమ్రోగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోను సూద్… రీల్ లైఫ్ విలన్ కాగా, రియల్ లైఫ్ హీరో గా ఎంతో మంది మనసులు గెలుచుకున్నాడు. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సహాయం చేసి పెద్ద మనసు చాటుకున్న దేవుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ నటుడు అయిన సోనుసూద్ కరోనా కష్టకాలంలో లాక్ డౌన్ విధించడంతో వలస కార్మికులు తమ కుటుంబ సభ్యులను చేరడం కోసం ఏంతో సేవ చేశారు. ఆ సేవ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇప్పటికీ సొనూసూద్ తన మానవత్వాన్ని చాటుకుంటూనే ఉన్నారు.
అయితే, తాజాగా సోనూ సూద్ చేసిన ఓ పనికి నెటిజన్లు ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వివరాలలోకి వెళితే డిసెంబర్ 13వ తేదీన సోనూసూద్ ఓ వీడియో పోస్టు చేశారు. అందులో కదులుతున్న రైల్లో సోనూసూద్ ఫుట్ బోర్డుపై కాస్త అజాగ్రత్తగా ప్రయాణిస్తూ కనిపించాడు. హ్యాండ్రైల్ పట్టుకుని కదులుతున్న రైలు తలుపు అంచున తన కాలి వేళ్లపై కూర్చొని.. రైలు నుంచి బయటకు చూస్తూ కనిపించాడు. 20 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఇది చూసిన ప్రతి ఒక్కరు సోనూసూద్పై మండిపడుతున్నారు.
‘కదులుతున్న రైలు డోర్ నుంచి బయటకు వేలాడటం చాలా ప్రమాదకరం..’, ‘ఇలాంటి వాటిని ప్రోత్సహించడం నటుడి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం’, ‘ఇలాంటి వీడియోలు సోషల్మీడియాలో పెట్టే ముందు కనీసం ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి’, ‘దేశవ్యాప్తంగా చాలా మందికి రోల్ మోడల్గా ఉన్న మీరు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదు’ అంటూ నెటిజన్స్ తిట్టి పోస్తున్నారు. మరి కొందరు అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా సోషల్ మీడియాలో ప్రస్తుతం సోనూసూద్ చేసిన వీడియో పై ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతోంది .ఎవరికి వారు తమదైన శైలిలో ఇది మంచి పని కాదు అంటూ సోనూసూద్ ను విమర్శిస్తుండగా, దీనిపై ఆయన ఏమన్నా స్పందిస్తారా అన్నది చూడాలి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…