Nasser : నటుడిగా, రాజకీయ నాయకుడిగా సత్తా చాటుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన ప్రసంగాలతో అందరి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాడు. రాజకీయ సభ అయిన, సినిమా ఫంక్షన్ అయిన సరే పవన్ చేసిన వ్యాఖ్యలు కొన్ని హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఇటీవల జరిగిన ‘బ్రో’ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సిని పరిశ్రమలో మనవాళ్లే చేయాలి అనే ధోరణి నుంచి బయటకు రావాలి. తెలుగు చిత్ర పరిశ్రమ భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా కళాకారులను ఆహ్వానిస్తుంది. కోలీవుడ్లో కూడా ఇలాగే కొనసాగితే పరిశ్రమ మంచి స్థాయికి చేరుతుంది అని అన్నారు.
తమిళ పరిశ్రమ తమిళం వారికే అంటే పరిశ్రమ ఎప్పటికీ ఎదగదు. ఈరోజున తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుతుందీ అంటే అన్ని పరిశ్రమల వారినీ కలుపుకొని వెళ్తుంది కాబట్టే. ఒక్కళ్ళు కాదు, అన్ని భాషల్లో కలయిక ఉంటేనే సినిమా అవుతుంది తప్ప.. ‘ఇది మన భాష. మనమే ఉండాలి’ అంటే.. కుంచించుకుపోతాం. మీరు కూడా తమిళ పరిశ్రమ నుంచి బయటికి వచ్చి ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తీయాలని, మీ పరిశ్రమను విస్తృతం చేసుకోవాలని తమిళ పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నా అని పవన్ చెప్పారు. పవన్ వ్యాఖ్యలతోపాటు సోషల్ మీడియాలో తమిళ పరిశ్రమపై జరుగుతున్న చర్చపై నడిగర్ సంఘం అధ్యక్షుడు, నటుడు నాజర్ స్పందించారు.
తమిళ సినిమాల్లో తమిళ నటులే నటించాలని, ఇతరులకు అవకాశం లేదని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదు. ఒకవేళ కోలీవుడ్లో అలాంటి ప్రతిపాదన వస్తే మొదటగా నేనే ప్రశ్నిస్తాను. మనమంతా పాన్ ఇండియా, గ్లోబల్ స్థాయి చిత్రాలు చేస్తున్నాం. ఏ సినిమా పరిశ్రమకైనా ఇతర భాషల ఆర్టిస్ట్ల అవసరం తప్పక ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఎవరూ ఈ తరహా నిర్ణయాలు తీసుకోరు. అయితే తమిళ చిత్ర పరిశ్రమ కార్మికుల కష్టాలు తీర్చేందుకు సెల్వమణి ఓ బలమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే అందులో పర భాషా ఆర్టిస్ట్లు ఉండకూడదు అన్న ప్రస్తావన అయితే లేదు. తమిళ చిత్ర పరిశ్రమకు ఓ ట్రెడిషన్ ఉంది. ఎస్వీ రంగారావు, సావిత్రమ్మ, వాణిశ్రీలాంటి ఎందరో అగ్రతారలు తమిళ సినిమాలో భాగమై ఉన్నారు. ఆ సంప్రదాయం ఎప్పటికీ అలాగే ఉంటుంది. దయచేసి తప్పుడు వార్తలని నమ్మవద్దు. బాషా బేధాలు లేకుండా అందరం కలిసి పని చేద్దాం. ఇండియన్ సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్దాం అని నాజర్ తను రిలీజ్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చాడు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…