Nara Lokesh : నారా లోకేష్‌కి పోలీసుల నోటీసులు.. వారి ముందే చ‌దివి వినిపించాడుగా..!

Nara Lokesh : యువగళం పాదయాత్రలో నారా లోకేష్ దూసుకుపోతున్నారు. అయితే తాజాగా ఆయ‌న‌కి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం బేతపూడిలో నారా లోకేష్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. లోకేష్ శిబిరంలో జరిగిన దాడిలో భాగంగా.. భీమవరం పోలీసులు నోటీసులు జారీ చేశారు. యువగళంలో కార్యకర్తలు దాడి చేయడం, ఎక్కువగా వాహనాల ఏర్పాటు, ఫ్లెక్సీ వివాదంలో భాగంగా నోటీసులు ఇచ్చారు. మంగళవారం రాత్రి జరిగిన సభలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. గన్నవరంలో కూడా నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా.. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆ నోటీసులు అందుకున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కవ్వింపులకు దిగారని.. తాడేరు దగ్గర తమపై రాళ్ల దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. యువగళం వాలంటీర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై సరికాదన్నారు.

పోలీసుల ముందే నోటీసులు చ‌దువుతూ.. వైసీపీ వాళ్లను కించపరిచేలా తామెప్పుడూ మాట్లాడట్లేదని, ఏ జిల్లాలో జరగని అరాచకాలు ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయని లోకేష్ ప్రశ్నించారు. తమ కార్యకర్తల చేతిలో ఎక్కడైనా ఒక్క రాయి అయినా చూశారా? అని ప్రశ్నించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మాత్రమే వినియోగించుకుంటున్నామని, తాను పాదయాత్రను శాంతియుతంగానే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తాము ఫిర్యాదులు చేసినా.. వాళ్లపై కేసులు నమోదు చేయట్లేదన్నారు. కొంతమంది పోలీసుల తీరు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందన్నారు. ‘నన్ను కించపరిచేలా వైసీపీ శ్రేణులు కార్టూన్లు వేస్తున్నారు.. మాకు కూడా అనుమతించండి.. మేం కూడా ఫ్లెక్సీలు వేస్తాం’ అని లోకేష్ అన్నారు.

Nara Lokesh read notices served by police
Nara Lokesh

టీడీపీ శ్రేణులపై దాడి చేసిన వారి ఫొటోలు ఉన్నాయని వారిని అరెస్ట్‌ చేశారా? అని లోకేష్ ప్రశ్నించారు. కవ్వింపు చర్యలకు పాల్పడే ఫ్లెక్సీల సంస్కృతి ఇప్పుడే చూస్తున్నామన్నారు. సీఎం జగన్ పర్యటన ఉంటే చాలు.. హౌస్‌ అరెస్టులు చేస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పదాలు కించపరిచేలా ఉన్నాయో జగన్‌ చెప్పాలన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ వారాహియాత్ర సమయంలో ఇక్కడే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నినాదాలు చేశారన్నారు. అప్పుడే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. యువగళం వాలంటీర్లను అదుపులోకి తీసుకుని వైఎస్సార్‌సీపీ నేతల ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారని.. చట్టాలు ఇరువైపులా సమానంగా అమలు చేయాలని లోకేష్ స్ప‌ష్టం చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

22 hours ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 day ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

4 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

4 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

4 days ago