Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ విజయదశమి పండగ రోజున వినూత్న కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ‘‘దేశం చేస్తోంది రావణాసుర దహనం – మనం చేద్దాం జగనాసుర దహనం’’ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినదిద్దామని చెప్పారు. అక్టోబర్ 23వ తేదీన విజయదశమి పర్వదినం సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల మధ్యలో వీధుల్లోకి వచ్చి “సైకో పోవాలి“ అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. సైకో జగన్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించబోయే విజయంగా ఈ దసరా పండగని సెలబ్రేట్ చేసుకుందాం’’ అని నారా లోకేష్ తెలిపారు.
ఇక టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలను తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ లోకేష్ భావోద్వేగంతో మాట్లాడారు.. ఏ తప్పు చేయకున్నా అరెస్ట్ చేయడం బాధ కలిగించింది అన్నారు. ప్రజల కోసం పోరాడిన చంద్రబాబు అంటూ లోకేష్ కంటతడి పెడ్డారు. ఏ తప్పు చేయకున్నా చంద్రబాబును జైల్లో పెట్టారని.. తమ ఆస్తులన్నీ బహిర్గతం చేశామని.. డబ్బే సంపాదించాలని చంద్రబాబే భావిస్తే రాజకీయాలు అవసరం లేదని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు తన రాజకీయ జీవితంలో, ముఖ్యమంత్రిగా ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించారని.. అలాంటి చంద్రబాబుపై దొంగ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం చంద్రబాబు పని చేశారని.. ప్రజలంతా ఆలోచించాలన్నారు. ఇవాళ చంద్రబాబు కుటుంబానికి ఇబ్బంది వచ్చిందని.. రేపు ప్రతి ఒక్కరి కుటుంబానికి ఇదే పరిస్థితి రావొచ్చన్నారు. జగన్ ఆలోచనలు ఇదే విధంగా ఉంటాయని.. టీడీపీ-జనసేన పోరాడకుంటే రాష్ట్రం ముక్కలు చేసి అమ్మేసేవారన్నారు. ప్రజల కోసం పోరాడినందుకే చంద్రబాబును జైల్లో పెట్టారని మండిపడ్డారు. టీడీపీ-జనసేన కలిస్తే 160 స్థానాలు ఖాయమని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఏనాడైనా మా అమ్మ బయటకొచ్చారా?.. చివరకు మా తల్లిపైనా కేసులు పెడతామని బెదిరిస్తున్నారు’ అంటూ లోకేష్ మండిపడ్డారు. ఏనాడు ప్రభుత్వ కార్యక్రమాలకు తన తల్లి రాలేదని.. అసెంబ్లీ సాక్షిగా జగన్, ఆయన సైన్యం ఆమెను అవమానించారన్నారు. సేవా కార్యక్రమాలు తప్ప రాజకీయాలు తన తల్లికి తెలియవన్నారు. గవర్నర్ను కలిసేందుకు కూడా వెళ్లలేదని.. చంద్రబాబుకు పంపించే భోజనంలో విషం కలుపుతారని ఆరోపణలు చేస్తున్నారన్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…