Nara Lokesh : సాక్షి మీడియాపై లోకేష్ పంచ్‌లు.. చుట్టు ప‌క్క‌ల వారంద‌రు తెగ న‌వ్వేశారుగా..!

Nara Lokesh : ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఒక‌రిపై ఒక‌రు దారుణ‌మైన విమర్శ‌లు చేసుకుంటూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌‌ను కలిశారు. జగన్‌ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని.. అక్రమ కేసులు బనాయిస్తోందని ఫిర్యాదు చేశారు. లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాతతో పాటు నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, అశోక్‌బాబులు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడారు లోకేష్‌.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగాయన్నారు నారా లోకేష్. ఈ విషయాన్నే గవర్నర్‌కు వివరించామని తెలిపారు. బాపట్ల జిల్లాలో బీసీ వర్గానికి చెందిన అమర్నాథ్‌ గౌడ్‌ నోట్లో పేపర్లు కుక్కి, పెట్రోల్‌ పోసి వైఎస్సార్‌సీపీ నేతలు తగులబెట్టారన్నారు. దళిత వర్గానికి చెందిన శ్యామ్‌కుమార్‌పై దాడి చేసి మూత్రం పోసిన ఘటననూ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఆయనకు వివరించామన్నారు.ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు అడ్డుకట్ట వేసేలా రూపొందించిన 17ఏ సెక్షన్‌ను సైతం తుంగలో తొక్కి.. గవర్నర్ వ్యవస్థను కూడా గౌరవించకుండా జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వివరించామన్నారు లోకేష్. ప్రతిపక్షాలపై జగన్‌కు నరనరానా కక్ష సాధింపే ఉందన్నారు లోకేష్. టీడీపీ సానుభూతిపరులపై 60 వేల కేసులు పెట్టారన్నారు.

Nara Lokesh comedy on sakshi media reporter
Nara Lokesh

ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఎటువంటి ఆధారాలు లేకపోయినా 53 రోజుల పాటు జైలులో నిర్బంధించిన విధానాన్ని గవర్నర్‌కు తెలిపామన్నారు. ఈ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు చెక్ పెట్టేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 ప్రకారం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరామన్నారు. టీడీపీ నేతలపై వందలాది అక్రమ కేసులు బనాయించారని.. ఈ విషయాన్ని ఆధారాలతో సహా గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఇక చివ‌రిగా సాక్షి వాళ్లు రాలేదా అని అడిగారు. ఆ మీడియా రిపోర్ట‌ర్ లేక‌పోవ‌డంతో టీవీ 9, ఎన్టీవీ వాళ్లు వ‌చ్చిన‌ట్టున్నారుగా, మీరు ఎవైన ప్ర‌శ్న‌లు వేస్తారా అని అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ల‌డం లేదు ప్ర‌శ్న‌లు ఏమైన ఉంటే అడ‌గ‌మ‌ని అన్నాడు లోకేష్‌.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

12 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago