Nagababu : ఏపీ ఎన్నికలు ఈ సారి మంచి రంజుగా సాగాయి. ప్రచారంలో చాలా మంది ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. కొందరు తమకి నచ్చిన వారికి మద్దతు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడంతో మొదలైన రగడ నాగబాబు ట్వీట్తో మరింత వేడెక్కింది. అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టిందన్న చర్చ జరుగుతోంది.కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైఎస్సార్సీపీ నంధ్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం నంద్యాల వెళ్లి అక్కడ ప్రజలని తన స్నేహితుడికి ఓటు వేయాల్సిందిగా అడిగారు. అల్లు అర్జున్ నంధ్యాల పర్యటన వివాదం కూడా యింది. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఈ పర్యటన చేసినందుకు, అక్కడ అల్లు అర్జున్ ని చూడటానికి వందలాది మంది ప్రజలు వచినందువలన శాంతి భద్రలకు ఆటంకం కలిగింది అని అల్లు అర్జున్ పై ఒక కేసు కూడా నమోదైంది.
మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని గత కొంతకాలంగా ఎక్కడోచోట వార్తలు చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల నడుమ తాజా ఎన్నికలకు ముందు అల్లు అర్జున్.. వైసీపీ లీడర్ శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లడం హాట్ టాపిక్ అయింది.ఓ వైపు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్.. కూటమి తరఫున పోటీ చేస్తున్న ఈ సమయంలో శిల్ప మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించడానికి బన్నీ నంద్యాల వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. మెగా ఫ్యామిలీతో ఉన్న వైరం కారణంగానే బన్నీ ఈ స్టెప్ తీసుకున్నారనే టాక్ నడిచింది.
నష్టనివారణలో భాగంగానే అల్లు అర్జున్ సోమవారం పోలింగ్ ముగిసిన వెంటనే మీడియా ముందుకు వచ్చాడు. ఫిలింనగర్లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఓటు వేసిన తర్వాత ”నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అన్ని పార్టీలు ఒక్కటే. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా, లేకపోయినా వ్యక్తిగతంగా నా మద్దతు ఉంటుంది. మా మావయ్య పవన్కల్యాణ్కు నా పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుంది. నంద్యాలలో రవి గారికి కూడా అలాగే మద్దతు తెలిపాను. భవిష్యత్లో తన మావయ్య చంద్రశేఖర్, బన్నీ వాస్ వ్యక్తిగతంగా దగ్గరైన వ్యక్తులెవరికైనా మద్దతు ఇవ్వాల్సి వస్తే ఇస్తానని ప్రకటించారు.అయితే ఇదే సమయంలో నాగబాబు చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. , “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!,” అని పోస్ట్ చేశారు. ఇందులో ఎవరి పేరు చెప్పకపోయినా, ఇది అల్లు అర్జున్ ని ఉద్దేశించి అన్నట్టుగానే వుంది అని నెటిజన్స్ అంటున్నారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…