Mokshagna : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి స్పందించి ఎప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. ఇటీవల గోవా ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న బాలకృష్ణ .. ఈ సందర్భంగా మోక్షజ్ఞ ఎంట్రీపై మాట్లాడారు. తన కుమారుడిని వచ్చే సంవత్సరం టాలీవుడ్లోకి పరిచయం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం బాలయ్య స్పష్టతనివ్వలేదు. అయితే బాలయ్య ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్గా ఆదిత్య 999 సినిమాని చేయాలని చూస్తుండగా, ఈ సినిమాతో మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడని తెలుస్తుంది.
‘ఆదిత్య 999’ పేరుతో సీక్వెల్ ప్లాన్ చేసిన బాలయ్య.. ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ చేశారని, ఫిబ్రవరిలో లాంచింగ్ ఉంటుందని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్య, మోక్షజ్ఞ ఇద్దరు కలిసి నటిస్తారని టాక్. ప్రస్తుతం మోక్షజ్ఞ యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకుంటుండగా..ఆయన ఎంట్రీకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి అని తెలుస్తోంది. నిజానికి మోక్షజ్ఞ లాంచింగ్ మూవీ కోసం బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి పేర్లు వినిపించినప్పటికీ ప్రస్తుతానికి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. మరి ఆదిత్య 999 సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వస్తున్న వార్తలలో నిజం ఎంత ఉందనేది చూడాల్సి ఉంది.
టెక్నాలజీ పెద్దగా లేని సమయంలోనే టైమ్ మెషిన్ కాన్సెప్ట్తో ‘ఆదిత్య 369’ సైన్స్ ఫిక్షన్ మూవీని అద్భుతంగా తీయగలిగారు. మరి ఇప్పుడు సాంకేతికత భారీ స్థాయిలో అభివృద్ధి చెందినందున ఇప్పుడు ‘ఆదిత్య 999’ సినిమాని మరింత రిచ్గా తీయాలనే ప్లాన్ బాలయ్య చేసినట్టు టాక్. ఈ సినిమాకి తనే కథ అందించినట్లు బాలయ్య గతంలోనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక బాలయ్య ప్రస్తుతం వీరసింహారెడ్డి చిత్రంతో బిజీగా ఉన్నారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే పాటలు, బాలయ్య సిగ్నేచర్ స్టెప్పులతో ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరోవైపు అన్స్టాపబుల్ అనే టాక్ షో చేస్తున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…