MLA Kale Yadaiah : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. గురువారం అసెంబ్లీలో స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. స్పీకర్గా ఎన్నికైన గడ్డం ప్రసాద్కు సీఎం రేవంత్ రెడ్డి , మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు అభినందనలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి స్పీకర్ ప్రసాద్ కుమార్ను గౌరవ పూర్వకంగా ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం వరుసగా ఎమ్మెల్యేలు స్పీకర్ చైర్ వద్దకు వచ్చి ప్రసాద్ కుమార్కు అభినందనలు తెలియజేశారు. అనంతరం స్పీకర్కు ధన్యవాదాల తీర్మానంపై సభ్యులు మాట్లాడారు.
ఒక్కొక్కరు స్పీకర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా స్పీకర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు, మేము పవిత్ర స్నేహితులం. ఒకటే సారి ఎంపిటీసీలం. ఒకటే నియోజకవర్గం. వికారాబాద్ సీటు కోసం నాలుగు సార్లు కొట్టుకున్నాం. 2008లో రాజశేఖర్ రెడ్డి గారు మీకు నాకు నచ్చజెప్పి మీకు టిక్కెట్ ఇచ్చారు. నామినేషన్ వేయడానికి నా బైక్ మీద మిమ్మల్ని తీసుకెళ్లాం. మనం అపూర్వ స్నేహితులం. ముఖ్యమంత్రి కూడా నన్ను వికారాబాద్ పోతవా అని అడిగిన కూడా చేవెళ్లలో ఉంటాం. ట్రాఫిక్ జామ్ అవుతుందని, నా బైక్ మీద మిమ్మల్ని తీసుకెళ్లాను అంటూ అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు యాదయ్య.
రాష్ట్ర సచివాలయంలో ఆర్ధిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల మంత్రిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలి సంతకం చేశారు. పలువురు మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించి ఫైల్స్ పై సంతకం చేశారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…