Minister Seethakka : తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ధనసరి అనసూయ అలియాస్ సీతక్క మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్లో వేదమంత్రోచ్ఛరణాల మధ్య ఆమె మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి ఫైల్ మీద సంతకం పెట్టారు. ఈ మేరకు ఆమె అంగన్వాడీలకు గుడ్న్యూస్ చెప్పారు. ఇప్పటివరకు మినీ అంగన్వాడీలుగా ఉన్న కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తూ రూపొందించిన ఫైలుపై మంత్రి సీతక్క తొలి సంతకం చేశారు. ఆమె నిర్ణయంతో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సీతక్క తన ప్రత్యర్థిపై 33,700 మెజార్టీతో గెలిచి.. ప్రస్తుతం మంత్రిగా స్థానం దక్కించుకుందంటే.. ఆమె ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్నప్పుడు.. జనాల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేసినప్పుడు కూడా రాని స్పందన వచ్చిందంటేనే.. ప్రజల్లో ఆమెకు ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది. అయితే.. ఆ క్రేజ్ ఊరికే రాలేదు. అడవి నుంచి జనాల్లోకి వచ్చి మూడో సారి అసెంబ్లీకి.. అది కూడా ఓ మంత్రి హోదాలో వెళ్తున్నారంటే.. ఆమె ప్రస్థానం సాఫీగా ఏమీ సాగలేదు. ఎన్నో మలుపులు, మరెన్నో ఎత్తు పల్లాలు.. ధనసరి అనసూయ అలియాస్ సీతక్కది.
రీసెంట్గా సీతక్క అసెంబ్లీలో తనదైన స్పీచ్తో ఆకట్టుకుంది. స్పీకర్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఆమె అందరిని ఆశ్చర్యపరచింది. అలానే తన జీవితం ఎలాంటిదో కూడా సీతక్క కూడా చెప్పడంతో రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకింత ఎమోషనల్కి గురయ్యారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే తత్వం మా సీతక్కది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…