Manchu Lakshmi : మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు నటిగాను, హోస్ట్గాను అదరగొట్టిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే మంచు లక్ష్మీ ఒక్కోసారి ఆసక్తికర పోస్ట్లు పెడుతూ వార్తలలో నిలుస్తూ ఉంటుంది. తాజాగా జీవితంలో సరిదిద్దుకోలేని తప్పులు చేశానని మంచు లక్ష్మి పేర్కింది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నా జీవితంలో సరిదిద్దు కోలేని తప్పులు చేశాను. అవి ఇప్పుడు నేను మార్చలేను. ఇప్పుడు పూర్తిగా మారి పోయాను. మళ్ళీ ఆ తప్పులు ఎప్పుడు చేయనంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది మంచు లక్ష్మీ. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక మంచు లక్ష్మీ విషయానికి వస్తే సినిమాల్లో నటించడంతోపాటు పలు సినిమాలను నిర్మించిన మంచు లక్ష్మీ.. నటిగా, నిర్మాతగా, హోస్ట్ గా మంచి పేరును తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. చాలా కాలం అమెరికాలో ఉన్న మంచు లక్ష్మి అమెరికన్ టెలివిజన్ షోస్ హోస్ట్ గా వ్యవహరించింది. హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించడం విశేషం. మంచు లక్ష్మి ఇంగ్లీష్ స్కిల్స్ అందుకు ఉపయోగపడ్డాయి. దీంతో టాలీవుడ్ ని దున్నేద్దామని హైదరాబాద్ లో ల్యాండ్ అయిన ఈ అమ్మడికి బ్రదర్స్ మాదిరి మంచు లక్ష్మికి కూడా కాలం కలిసిరాలేదు.
ఇటీవల సంజు రెడ్డి అనే ఓ వ్యక్తి తన ట్విట్టర్ లో పవన్ కల్యాణ్ ఫొటోతో పాటు మంచి లక్ష్మి ఫోటో షేర్ చేస్తూ.. అక్క స్టిల్స్ కూడా కాపీ కొట్టే కదా అని రాసుకొచ్చాడు. సోషల్ మీడియాలో నెటిజన్స్ ఇలా చేయడం సహజం.. కానీ ఈ ట్వీట్ ను మంచు లక్ష్మీ రీ ట్వీట్ చేసింది. మంచికైనా చెడుకైనా నా చిత్రం పక్కనే పవన్ కళ్యాణ్ ఫొటో పెట్టారని రాసుకొచ్చారు. ఇలా మంచు వారమ్మాయి ట్వీట్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ సినిమాలు అడపాదడపా చేస్తూ మరోవైపు హోస్ట్గాను అదరగొడుతుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…