Mallareddy : తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉందనే విషయం తెలిసిందే. ఆయన చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. మల్లారెడ్డి ఏది మాట్లాడినా జనాల్లోకి విపరీతంగా వెళ్లిపోతుంది. ‘పాలమ్మినా, పూలమ్మినా, బోర్లు వేసినా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అసెంబ్లీ వద్ద ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న మల్లారెడ్డికి తీన్మార్ మల్లన్న ఎదురుపడ్డారు. మల్లన్నను మల్లారెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
హజంగానే మల్లారెడ్డి అంటే చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న) ఎగిరి పడుతుంటారు.. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విమర్శలు చేస్తూ ఉంటారు. మల్లారెడ్డి భూకబ్జాలు చేశాడని, అతడు చేసిన భూతం దందాలకు సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయని పలుమార్లు తీన్మార్ మల్లన్న ప్రకటించాడు కూడా. అంతేకాదు మల్లారెడ్డి బాధితులతో మాట్లాడాడు కూడా. అయితే ఇదే సందర్భంలో మల్లారెడ్డి ఆదేశాలతోనే మేడిపల్లి పోలీసులు పలుమార్లు నన్ను అరెస్టు చేయించి జైల్లో పెట్టారని మల్లన్న చాలాసార్లు చెప్పుకు రావడ మనం చూశాం. ఒకానొక దశలో మొదటి ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మల్లన్న చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని రద్దు చేసుకున్నాడు.
బద్ధ శత్రువుల్లా కనిపించే వీరిద్దరూ అసెంబ్లీ లాబీలో కలుసుకున్నారు. వీరికి కొంతమంది విలేకరులు కూడా జతయ్యారు. సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. వాటికి మల్లారెడ్డి కూడా తన స్టైల్లో సమాధానం చెప్పారు. తీన్మార్ మల్లన్న మేడ్చల్లో పోటీ చేస్తే టఫ్గా ఉండేదా? అని అడగ్గా అలా ఏమీ కాదని మల్లన్న అన్నారు. లేదూ.. మల్లన్న ఓడిపోయేవాడన్నట్టుగా తీన్మార్ మల్లన్న కామెంట్ చేశాడు. నువ్వు ఏదైనా అనుకో.. ఎలాగైనా అనుకో అంటూ మల్లారెడ్డి లైట్ తీసుకున్నాడు. మేడ్చల్లో తీన్మార మల్లన్న పోటీ చేస్తే ఒక మల్లన్న అయితే.. అసెంబ్లీకి వచ్చేవాడని అన్నాడు. ఎవరు వచ్చినా ఒక్కటేనా? అని అడగ్గా.. ఒక్కటే కదా అని మల్లారెడ్డి అన్నారు. తీన్మార్ మల్లన్న కూడా ఇందుకు అంతే అన్నట్టుగా సమాధానం ఇచ్చాడు. తామిద్దరిదీ పాల‘కులం’ అని వివరించాడు. ఇద్దరికీ పాలతో సంబంధం ఉన్నదని చెప్పాడు. ఆ తర్వాత కాంగ్రెస్కు శాసన సభలో ఏమైనా తక్కువ పడితే సపోర్ట్ చేస్తావా ? అని తీన్మార్ మల్లన్న అడగగా, తప్పకుండా ఉంటానని చెప్పాడు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…