Naga Chaitanya : అక్కినేని మూడో తరం వారసుడు నాగ చైతన్య స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. చివరిగా చైతూ నటించిన థాంక్యూ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే నాగ చైతన్య కెరీర్ని మార్చేసిన చిత్రం ఏ మాయ చేశావే. ఈ సినిమా అసలు ముందుగా మహేష్ దగ్గరకు వెళ్లిందట. ఆయన నో చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ చైతూ దగ్గరకు వెళ్లడం, ఈ సినిమాతో కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం జరిగింది.
ఏ మాయ చేశావే మూవీ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ కథను తొలిసారిగా మహేశ్ బాబుకే వినిపించినట్టు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ముందుగా మంజులకు ఈ కథ గురించి చెప్పాడట. కథ బాగుంది కానీ మహేశ్ చేస్తాడో.. లేదో.. అని గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో మంజుల తెలిపినట్లు సమాచారం. తర్వాత ఈ కథను మహేశ్ బాబుకు చెప్పగా.. చిన్న స్టోరీ కదా.. అని అనేశాడట. మహేశ్ బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలిసి సినిమా చేస్తున్నారంటే ఆ అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయని నో చెప్పాడట.
అయితే ఏదైనా యాక్షన్ కథ చేద్దామని మహేశ్ బాబు చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ మూవీని మహేశ్ చేసి ఉంటే పెద్ద సినిమా అయ్యేదని గౌతమ్ మీనన్ తెలిపాడు. ఇక అక్కినేని నాగ చైతన్య, సమంత తొలిసారిగా జోడీ కట్టి, హిట్ కొట్టి, ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రం ఏ మాయ చేశావే. ఈ మూవీ ఎంతపెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ చిత్రాన్ని గౌతమ్ మీనన్ తమిళ్ లో శింబు తో తెరకెక్కించాడు. అక్కడ జెస్సీ పాత్రలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…