Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల నాయికలు ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్నారు.ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత SSMB 29 చేయనున్నారు.ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యూనివర్సల్ అడ్వెంచర్ కథాంశంతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
హాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. ఇక ఇదిలా ఉంటే సినిమా షూటింగ్స్తో బిజీగా ఉండే మహేష్.. తన ఫ్యామిలీతో విహార యాత్రలకు వెళుతుంటారు. సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి పారిస్, జర్మనీ, స్విట్జర్లాండ్కు వెళ్లి వస్తుంటారు. తాజాగా దుబాయ్ ట్రిప్ కు వెళ్లారు. అయితే, మహేశ్ దుబాయ్ ట్రిప్పై సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. మహేశ్బాబు సినిమాలే కాకుండా కమర్షియల్ యాడ్స్తో పాటు బిజినెస్లు కూడా చేస్తున్నాడు. మొన్నీమధ్యనే హోటల్ బిజినెస్లోకీ అడుగుపెట్టిన మహేష్ ఇప్పటికే ముంబై, గోవా, బెంగళూరులో విలాసవంతమైన విల్లాలను మహేశ్ కొనుగోలు చేశారట.
తాజాగా దుబాయ్ లోనూ ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ టాక్. దుబాయ్లోని పాష్ ఏరియాలో అత్యంత విలాసవంతమైన విల్లాను మహేశ్ కుటుంబం కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ విల్లా ఖరీదు కోట్లల్లో ఉంటుందని తెలుస్తుంది. ఖరీదైన ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసమే మహేశ్ ప్రస్తుతం దుబాయ్ వెళ్లారని పలు కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…