KTR : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సీఎం రేవంత్ లక్ష్యంగా బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలు పైన స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలవిగానీ హామీలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆయన్ను తామెందుకు వదిలిపెడతామన్నారు. తాము చేసిన ప్రతీ అప్పుకు ఆడిట్ రిపోర్ట్ ఉందన్నారు. వారు చూసుకోక పోతే తమకేం సంబంధమని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సాగించేందుకు చేసుకోవలసిన సర్దుబాట్ల నేపథ్యంలో తాము ఆరు నెలల వరకు వేచి చూస్తామని, మౌనంగా ఉంటామని ఆ తర్వాత పాలన సాగించకపోతే ప్రశ్నిస్తామని కేటీఆర్ మీడియా ముఖంగా చెప్పిన విషయం తెలిసిందే.
అయితే ఆ విషయాన్ని పక్కన పెట్టిన కేటీఆర్ అప్పుడే అక్కసు వెళ్లగక్కుతున్నారు.కాంగ్రెస్ పార్టీ పాలన మొదలుపెట్టిన తొలినాళ్లలోనే అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చారంటూ, ఎలా వాటిని అమలు చేస్తారో చూస్తానంటూ కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డి పాలనను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు ఎన్నికల సమయంలో రేవంత్ చెప్పిన ప్రతి మాటకు రికార్డు ఉందని, ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని, రాగానే పెన్షన్ 4000 ఇస్తామని చెప్పారని, పది రోజులు ఆగండి 15000 రైతు భరోసా ఇస్తామన్నారని కానీ ఇంతవరకు ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
ఏపీలో పోల్చితే తెలంగాణలో హుందాతనం కనిపిస్తుంది. రాజకీయ నాయకులు విద్వేషపూరితంగా ఉండకుండా కలిసి కట్టుగా కనిపిస్తున్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ని రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పరామర్శించారు. అలానే తాజాగా అసెంబ్లీ పదవి కోసం నామినేషన్ వేస్తున్న సమయంలో కేటీఆర్, రేవంత్ రెడ్డి, భట్టి, అందరు కలిసి మెలిసి కనిపించడం ఆకర్షించింది. అంతేకాదు రేవంత్ రెడ్డిని కేటీఆర్ సరదాగా ఆట పట్టించడం కూడా కనిపించింది. తాము రాజకీయంగా ప్రత్యర్ధులమే తప్ప శత్రువులమి కాదు అన్నట్టుగా అక్కడి వాతావరణం కనిపించింది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…