Kodali Nani : ప్రస్తుతం వారాహి యాత్రలో భాగంగా పలు ప్రాంతాలు చుట్టేస్తున్న పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై విరుచుకుపడుతున్నారు. దీంతో సమయం దొరికినప్పుడల్లా వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే పేర్నినాని చెప్పులు చూపిస్తూ పవన్ పై ఘాటు విమర్శలు చేశారు. జగన్ కూడా ప్యాకేజ్ స్టార్ అంటూ మరోసారి పవన్ని విమర్శించారు. ఇక కొడాలి నాని అయితే ఇద్దరు హీరొయిన్స్ ని పోలుస్తూ పవన్పై విమర్శల వర్షం గుప్పించారు. గుడివాడలో టిడ్కో ఇళ్ల పంపిణీ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ…మహారాష్ట్రలో నవనీత్ కౌర్, కర్ణాటకలో సుమలత ఇండిపెండెంట్లుగా గెలిచారు కానీ ఈ పవర్ స్టార్ మాత్రం గెలవలేకపోయారని సెటైర్లు వేశారు.
గుడివాడ నియోజకవర్గంలో ఇళ్ళ పట్టాల కోసం చంద్రబాబు ఒక ఎకరం ఇచ్చినట్లు నిరూపించినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఆయన ఈ రాష్ట్రానికి జగనే శాశ్వత ముఖ్యమంత్రి అని కొడాలి నాని స్పష్టం చేశారు. అసెంబ్లీలో అడుగు పెట్టడానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారా అని ఆయన ప్రశ్నించారు.. నవనీత్ కౌర్, సుమలత ఇద్దరూ సినీ హీరోయిన్లని.. ఈ ఇద్దరూ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎంపీలు అయ్యారని తెలిపారు. అయితే 16 పార్టీలతో పొత్తులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఏం సాధించారని ప్రశ్నించారు.
చంద్రబాబు కోరిక ప్రతిపక్ష నేతగా ఉండటమని.. పవన్ కళ్యాణ్ కోరిక ఎమ్మెల్యే కావటమని.. దీని కోసం ఈ ఇద్దరూ పొత్తు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేగలిగే ధైర్యం ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవరికీ లేదని కొడాలి నాని పేర్కొన్నారు. . గుడివాడలోని టిడ్కో గృహాల సముదాయం ప్రాంగణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం జగన్.ఆ సభలోనే కొడాలి నాని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై దారుణమైన విమర్శలు చేశారు. ప్రస్తుతం కొడాలి నాని వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…