Celebrities : అయోధ్య రాముడికి సిని సెల‌బ్రిటీల నుండి ఎవ‌రెవ‌రు ఎంత విరాళం ఇచ్చారంటే..!

Celebrities : ఐదు దశాబ్దాలుగా యావత్ దేశం ఎదురుచూసిన ఆ క్షణం రానే వచ్చింది. అంగరంగ వైభవంగా ఆ శ్రీరాముడు అయోధ్యలో బాలరాముని రూపంలో కొలువుదీరాడు. ఈ మహా ఘట్టాన్ని ఒక్క భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా తిలకించారు. జైశ్రీరామ్ నినాదాలతో అయోధ్య మారుమోగింది.బాల రాముడిని చూసి ప్ర‌తి ఒక్క‌రు పుల‌కించిపోయారు. స్వ‌ర్ణాభ‌ర‌ణాల‌లో బాల‌రాముడు చాలా అందంగా క‌నిపించాడు. 500సంత్సరాల పోరాటం, 100 సంవత్సరాల న్యాయపోరాటం, లక్షలాది రామ భక్తుల ప్రాణదానాలు, కరసేవకుల త్యాగాల ఫలితంగా నేడు ఆ శ్రీరాముడికి భవ్య రామ మందిరం నిర్మిత మైంది. ఇక ఈ మ‌హాఘ‌ట్టాన్ని క‌నులారా వీక్షించేందుకు చాలా మంది సెల‌బ్రిటీలు అయోధ్య‌కి వెళ్లారు.

ఇక రాములోరికి ఎవరి స్థోమతకు తగినట్లు వాళ్లు బహుమతులు, విరాళాలు సమర్పించుకున్నారు. ఒక దశలో విరాళాలు ఇక చాలు, ఎవరూ విరాళం ఇవ్వొద్దంటూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రకటించాల్సి వచ్చింది. సూరత్ కు చెందిన భవికా మహేశ్వరి పదకొండేళ్ల వయసులో విరాళాల సేకరణ మొదలుపెట్టింది. మూడేళ్లపాటు దేశమంతా తిరుగుతూ రూ.52 లక్షల విరాళాలు సేకరించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేసింది. ఇక ఈ మందిర నిర్మాణానికి రూ. 30 లక్షలకు పైగా విరాళం ఇచ్చారు పవర్‌ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ . అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభం కాగానే అంటే 2021లోనే విరాళం అందించారు. ఆయ‌నే కాదు ఆయ‌న ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో కూడా ఇప్పించాడట మొత్తంగా ప‌వ‌న్ త‌ర‌పు నుండి అయోధ్య రామ మందిర నిర్మాణానికి సుమారు 80 లక్షల రూపాయల వరకు విరాళాలు వెళ్లాయని స‌మ‌చారం.

know Celebrities how much given to ayodhya ram mandir
Celebrities

ఇక బాపూ బొమ్మ‌గా పేరు తెచ్చుకున్న ప్ర‌ణీతా సుభాష్ గతంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం చేపట్టిన దేశవ్యాప్త ప్రచారానికి రూ.1 లక్ష విరాళంగా ఇచ్చారు. బిగ్‌ బాస్‌ ఆరో సీజన్‌ కంటెస్టెంట్‌ ఆది రెడ్డి .. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్‌కు తన వంతుగా ఒక లక్ష రూపాయలు విరాళం అందించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రామమందిర నిర్మాణం కోసం విరాళం ప్రకటించారు కాని ఎంతిచ్చారో స్పష్టంగా చెప్పలేదు. ఇక అయోధ్య రామమందిరానికి ఇటుకల విరాళం అందించారు అనుప‌మ్ ఖేర్. అలానే ముఖేష్ ఖన్నా- 1.11 లక్షల రూపాయలు మనీష్ ముంద్రా- కోటి రూపాయలు హేమ మాలిని, గుర్మీత్ చౌదరి ,గౌతమ్‌ గంభీర్‌- కోటి రూపాయలు అందించినట్టు స‌మాచారం. ప్ర‌భాస్ కూడా భారీగానే విరాళం అందించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

16 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

5 days ago