ప్రస్తుతం వరల్డ్ కప్లో టీమిండియా అదరగొడుతుంది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా తో జరిగిన పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీని అందుకుంది. భారత్ విజయంలో విరాట్ కోహ్లీ , కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి కీ రోల్ ప్లే చేసి హీరోలుగా నిలిచారు. భారత్ తరఫున కోహ్లి 85 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, రాహుల్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇద్దరి సూపర్ భాగస్వామ్యంతో టీమిండియా తన వేట మొదలుపెట్టింది. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 97 పరుగులతో అజేయంగా నిలిచిన.. కేఎల్ రాహుల్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
అయితే.. మ్యాచ్ ముగిసిన తర్వాత.. ప్రత్యేక విజయం సాధించిన భారత ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూంలో టీమిండియా కోచింగ్ స్టాఫ్ సత్కరించింది. విరాట్ కోహ్లీ.. తన అద్భుతమైన బ్యాటింగ్, ఫీల్డింగ్ కు గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ ఇచ్చిన క్యాచ్ పట్టినందుకు ఈ గోల్డ్ మెడల్ దక్కింది. అయితే, గోల్డ్ మెడల్ తీసుకునేటప్పుడు కోహ్లీ తెగ రచ్చ చేశాడు. అథ్లెట్లు.. మెడల్ తీసుకునేటప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో.. దానికి డబుల్ రేంజ్ లో కింగ్ రచ్చ రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది.
ప్రపంచ కప్లో భాగంగా టీమ్ఇండియా\ ఆడిన ప్రతి మ్యాచ్లో ఉత్తమంగా ఫీల్డింగ్ చేసిన ఆటగాడికి కోచ్ దిలీప్ ‘బెస్ట్ ఫీల్డర్’ అవార్డుతోపాటు గోల్డ్ మెడల్ అందిస్తున్నారు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్లో సిరాజ్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, జడేజా, శ్రేయస్ అయ్యర్ మైదానంలో చురుగ్గా పరుగెత్తారని దిలీప్ పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాగా చేశాడన్నారు. మొత్తం మీద రాహుల్ను ‘ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపిక చేశారు. గత మ్యాచ్లో ఈ అవార్డును అందుకున్న శార్దూల్ ఠాకూర్ చేతుల మీదుగా అతడికి గోల్డ్ మెడల్ అందించారు. అప్పుడు కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరచింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…