Kantara : గత కొద్దిరోజులుగా బాక్సాఫీస్ వద్ద కాంతార సినిమా సత్తా చాటుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సంచలన రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. కేవలం 16 కోట్లు పెట్టి తీసిన మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. నవంబర్ 24 నుంచి అమెజాన్ ప్రై మ్ లో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. అటు ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని హోంభలే ఫిలిం బ్యానర్ పై రిషబ్ శెట్టి హీరోగా నటించి, ఆయనే స్వయంగా దర్శకత్వం వహించారు.
ఇదిలా ఉంటే.. ఇలాంటి కథతోనే మన తెలుగులో కూడా ఒక సినిమా వచ్చిందని మీకు తెలుసా..! ఆ చిత్రం ఏదంటే.. ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో 2021 లో తెరకెక్కిన చిత్రం ఆకాశవాణి. ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్ పై పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేశారు కానీ అంతగా రెస్పాన్స్ రాలేదు. ఈ చిత్రం కూడా ప్రపంచానికి దూరంగా అన్నట్లుగా ఒక గ్రామం ఉంటుంది.
కొండకోనల్లో నివసించే అక్కడి జనానికి దొర మాటే శాసనం. అయితే అక్కడ ఉండే ఒక చెట్టు తొర్రలో బండరాయిని దైవంగా భావించి పూజలు చేస్తుంటారు. ఆ బండరాయి తర్వాత వాళ్ళని బతికించేది, శాసించేది దొరేనని బలంగా నమ్ముతారు. గూడెం సరిహద్దు దాటి బయట అడుగుపెడితే దేవుడు కఠినంగా శిక్షిస్తాడని, ప్రాణాలను తీస్తాడనే భయాన్ని దొర వారిలో నూరిపోస్తాడు. ఇక బయట నుంచి ఆ ఊరికి ఎవరు వచ్చినా దొర చంపేస్తాడు. అయితే ఆ ప్రజల జీవితాలను మార్చడానికి దేవుడు రేడియో రూపంలో వస్తాడు. అక్కడి నుంచి కథ ఆసక్తిగా ఉంటుంది. కానీ సినిమాలో నటులు ఎవరికి తెలియకపోవడంతో ఆ సినిమా ఆడలేదు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…