Jr NTR : సిద్దుజొన్నలగడ్డ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ టిల్లు స్వేర్. ఇటీవల థియేటర్లలోకి వచ్చి వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలన విజయం సాధించిన డీజే టిల్లు సక్సెస్ మీట్ సోమవారం హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు తివిక్రమ్ శ్రీనివాస్, విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. నేను మిమ్మల్ని కలవకముందుగా అభిమానులకు, మీడియా వారికి నమస్కారాలు తెలియజేసి తన ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. సిద్దూవి చాలా సినిమాలు చూశాను గానీ ఎప్పుడు వ్యక్తిగతంగా కలవలేదని , సిద్దు లాంటి వ్యక్తులు ఈ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారని సినిమా అంటే అతనికి అంత పిచ్చి అని అన్నారు.
టామ్ జెర్రీ,హిమాన్ వంటి క్యారెక్టర్స్ మన జీవితంలో ఎలా మిగిలాయో డీజే టిల్లు కూడా ఆ లిస్టులో చేరిందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ సినిమాలోని డైలాగ్స్ చెప్పారు. ఒక సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ తీసుకు వచ్చేటప్పుడు మేకర్స్ చాలా భయం ఉంటుంది. ఎందుకంటే ఆ సీక్వెల్ మొదటి సినిమాని మెప్పించకపోతే ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ విషయం గురించే ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “కల కనడానికి ఒక ధైర్యం ఉండాలి. అయితే ఆ కలని నిజం చేసుకోవడానికి భయం ఉండాలి” అని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముందు చెప్పుకొచ్చారు.
దానికి త్రివిక్రమ్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో ఎన్టీఆర్ రియాక్ట్ అవుతూ.. “కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి. అంతేగాని నేను ఇక్కడ ఉన్నానని గుర్తించండి. ఐయామ్ టెల్లింగ్ దట్. పోలె అదిరిపోలే” అంటూ అత్తారింటికి దారేది, కింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లోని డైలాగ్స్ ని మీమ్ లాంగ్వేజ్ లో మాట్లాడి ఆకట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ కి స్టేజి పైన ఉన్న సెలబ్రిటీస్, కింద ఉన్న అభిమానులు పడిపడి నవ్వుకున్నారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…