Jani Master : ప్రస్తుతం ఏపీలో రాజకీయం రంజుగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రావడంతో ఆయనకి మద్దతుగా పలువురు ప్రముఖులు కూడా రోడ్లపైకి వస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నెల్లూరులో అంగన్వాడి కార్యకర్తలు చేపట్టిన సమ్మెకు జానీ మాస్టర్ మద్దతు తెలిపారు. అంగన్వాడి కార్యకర్తల డిమాండ్లో న్యాయం ఉందని.. వారి డిమాండ్ను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని జానీ మాస్టర్ అన్నారు. తాను కూడా అంగన్వాడి కేంద్రానికి వెళ్లినవాడినేనని.. వారి కష్టం తనకు తెలుసని చెప్పారు . నేను నెల్లూరు నుంచి వచ్చిన వాడిని. అంగన్వాడీ కేంద్రంలో కూడా నేను తిన్న వాడిని, చదివిన వాడిని. బిషప్ శౌరి హై స్కూల్లో చదివాను. నేను పుట్టింది పాత చెక్ పోస్ట్ దగ్గర. అక్కడ రకరకాల వృత్తుల వారు ఉన్నారు.
వాళ్ళందరి గురించి నాకు తెలుసు. వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు, వాళ్లను అంగన్వాడి కార్యకర్తలు ఎంత బాగా చూసుకుంటారు అనే విషయాలు నాకు తెలుసు. ఇంతమంది మహిళలు రోడ్డుపైకి వచ్చి ఇన్నాళ్లుగా సమ్మె చేస్తున్న అది ముందుకు వెళ్లకపోవడం చూసి చాలా బాధపడ్డాను. నా వల్ల ఏమైనా అవుతుందేమో అని నా మాట సాయం వాళ్లకు పనికొస్తుందేమో అని వచ్చాను, నా మద్దతు తెలియజేశాను అని జానీ మాస్టర్ వెల్లడించారు. ఆ తర్వాత రిపోర్టర్స్ అడిగిన పలు ప్రశ్నలకు జానీ మాస్టర్ సమాధానం చెప్పారు. 2024 ఎన్నికల్లో జానీ మాస్టర్ పోటీ చేస్తారా అని అడగగా.. తెలియదు సార్ నుదిటి మీద ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది అని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు మద్దతు ఏ పార్టీకి ఇస్తున్నారు అని మరో రిపోర్టర్ అడగగా.. మద్దతు గురించి నేను ఇంకా ఏమీ అనుకోలేదని, దాని గురించి తర్వాత మాట్లాడతానని అన్నారు.
మీరు జనసేన తరపున వచ్చారని అందరూ అంటున్నారు..మీరేమంటారు అని ప్రశ్నించగా… నేను మళ్ళీ చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి. రామ్ గోపాల్ వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో జానీ మాస్టర్ కి జగన్ గారు అంటే అంత ఇష్టం. ముందు ముందు ఏం జరుగుతుందో నేను తర్వాత చెప్తాను అని వెల్లడించారు. అంగన్వాడి కార్యకర్తల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారా అని అడగగా..వాళ్ళు డిమాండ్ చేసేది వాళ్ళ హక్కు. అంత పెద్ద బాధ్యత నెత్తిన వేసుకొని ఇంటింటికి వెళ్లి పిల్లలని చూసుకోవడం అనేది పెద్ద బాధ్యత. వాళ్ళకు ఫోన్లు ఇస్తున్నారు. వాటికి సిగ్నల్ ఉండదు. అప్పటికప్పుడు ఫోటోలు పెట్టమంటారు. వీళ్ళు ట్రై చేస్తారు కానీ సిగ్నల్ దొరకదు. దానికి మీరు పని చేయట్లేదు అని ఉన్నతాధికారులు అంటారు అని జానీ మాస్టర్ వివరించారు. అయితే అంగన్వాడి కార్యకర్తల సమ్మెకు మద్దతు ఇవ్వడానికి జానీ మాస్టర్ జనసేన పార్టీ నాయకులతో కలిసి వెళ్లడం గమనార్హం.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…