ICC World Cup 2023 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ నేటి నుండి మొదలు కానుంది. క్రికెట్లో అతిపెద్ద టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ గురువారం (అక్టోబర్ 5) భారతదేశంలో ప్రారంభమవుతుంది. నవంబర్ 14న జరిగే ఫైనల్లో టైటిల్ను కైవసం చేసుకోవడానికి మొత్తం పది జట్లు ఒకదానితో ఒకటి పోటీపడతాయి. యితే ఇంత పెద్ద ఈవెంట్కు సంబంధించి విన్నర్, రన్నర్ ప్రైజ్మనీలు ఎంత ఉంటాయి? గ్రూప్ దశలో వెనుదిరిగిన జట్లకు ప్రైజ్ మనీ ఉంటుందా? ఈ ప్రశ్నలు క్రికెట్ ఫ్యాన్స్లో తలెత్తడం సహజం. అయితే వన్డే వరల్డ్ కప్ 2023కి సంబంధించిన ప్రైజ్మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. మొత్తం ప్రైజ్ మనీ రికార్డు స్థాయిలో 10 మిలియన్ డాలర్లుగా ఖరారు చేసింది. అంటే భారత కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ. 83 కోట్లుగా ఉంది.
ప్రైజ్ మనీ మొత్తాన్ని విన్నర్, రన్నర్, సెమీఫైనలిస్టులు, గ్రూప్ స్జేజ్లో వెనుదిరిగిన జట్లు పంచుకోనున్నాయి. ఇందులో సింహ భాగం విన్నర్కే దక్కనుంది. వరల్డ్ కప్ టైటిల్ విన్నర్కు రూ. 33 కోట్లు దక్కనున్నాయి. ఫైనల్లో ఓడిన జట్టు రూ. 16.58 కోట్లు చేజిక్కించుకోనుంది. ఇక సెమీ ఫైనల్ చేరకుండా నిష్క్రమించిన 6 జట్లకు రూ. 83 లక్షల చొప్పున దక్కనున్నాయి. గ్రూప్ స్టేజ్లో మొత్తం 45 మ్యాచ్లు జరగనున్నాయి. వీటిల్లో గెలుపొందిన జట్లు రూ. 33 లక్షల చొప్పున అందుకోనున్నాయి.ఇక టోర్నమెంట్లో భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మరియు నెదర్లాండ్లు పోటీ పడతాయి. రౌండ్-రాబిన్ ఫార్మాట్ లో మొదటి నాలుగు జట్లు సెమీ-ఫైనల్కు వెళుతుంది.
ప్రపంచ కప్ 2023 మ్యాచ్ లు ఉదయం 10:30 AM మరియు 2:00 PM IST గంటలకు ప్రారంభమవుతాయి.ఇక లైవ్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే.. భారతదేశంలోని స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. మొత్తం 48 మ్యాచ్లు డిస్నీ+ హాట్స్టార్లో యాప్ మరియు వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. డిస్నీ+ హాట్స్టార్లో ఉచితంగా మ్యాచ్లని వీక్షించవచ్చు. నవంబర్ 15న, 16 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచులు జరగనున్నాయి. నవంబర్ 19న తుది పోరు జరగనుంది. ఈ మ్యాచ్తో మెగా టోర్నీకి తెరపడుతుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…