ICC World Cup 2023 : వరల్డ్ కప్లో పాకిస్తాన్,సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. ఈ ప్రపంచకప్కే హైలెట్ అనదగ్గ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగింది. విజయం కోసం పాకిస్థాన్, సౌతాఫ్రికా కొదమసింహాల్లా హోరాహోరీగా తలపడిన మ్యాచ్లో గెలుపు చివరకు సఫారీలనే వరించింది. వికెట్ తేడాతో పాకిస్థాన్ మీద విజయం సాధించింది. . చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో సఫారీలు ఒక వికెట్ తేడాతో విజయం సాధించారు. పాకిస్థాన్ నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని 9 వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలోనూ సౌతాఫ్రికా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు వరుసగా నాలుగో మ్యాచ్లో ఓడిపోయిన పాకిస్థాన్.. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
అయితే నిన్న జరిగిన మ్యాచ్ పాకిస్తాన్కు డు ఆర్ డై మ్యాచ్ . ఇందులో గెలిస్తేనే ఆ జట్టు సెమీ ఫైనల్స్ చేరడానికి కొద్దో, గొప్పో అవకాశాలు ఉండేవి. కాని ఇప్పుడు ఆ మ్యాచ్ ఓడిపోవడంతో ఇక సెమీస్కి చేరడం కష్టంగానే మారింది. అయితే సెమీ ఫైనల్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపించింది. దక్షిణాఫ్రికా బౌలర్లను రెచ్చగొట్టింది. వారితో స్లెడ్జింగ్కు దిగింది ఫలితంగా- బౌలర్ల రిథమ్, ఏకాగ్రతను దెబ్బతీయాలనేది పాకిస్తాన్ గేమ్ ప్లాన్. గతి తప్పి బంతులను సంధిస్తే- వాటిని బౌండరీలు మలచాలనేది పాకిస్తాన్ వ్యూహం కావొచ్చు. మార్కో జన్సెన్తో వాగ్వివాదానికి దిగాడు మహ్మద్ రిజ్వాన్.
పాకిస్తాన్ ఓపెనర్లను పెవిలియన్ దారి పట్టించిన బౌలర్ అతను. నిప్పు కణికల్లాంటి బంతులను సంధిస్తోన్న జన్సెన్తో అకారణంగా వాగ్వివాదానికి దిగాడు రిజ్వాన్. అతని రిథమ్ను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. తన తొలి అయిదు ఓవర్లల్లో 22 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు జన్సెన్. ఇందులో ఒకటి మెయిడెన్ కూడా. అందుకే- అతన్ని టార్గెట్ చేశాడు రిజ్వాన్. వాగ్వివాదానికి దిగాడు. కొద్దిసేపు వారిద్దరి మధ్య వాడివేడిగా వాగ్వివాదం కొనసాగింది. దక్షిణాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్ జోక్యం చేసుకోవడంతో రిజ్వాన్ వెనుదిరిగాడు. మొత్తానికి థ్రిల్లింగ్గా సాగిన మ్యాచ్లో పాక్ ఓటమి చెందడి ఆ దేశ అభిమానులకి ఏ మాత్రం మింగుడుపడడం లేదు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…