Honey And Dates : ఖర్జూరాలు ఎంత తియ్యగా ఉంటాయో అందరికీ తెలిసిందే. వీటిని చాలా మంది తీపి వంటకాల్లో వేస్తుంటారు. చాలా మంది వీటిని రోజూ తింటుంటారు. ఇక తేనె కూడా ఎంతో తియ్యగా ఉంటుంది. దీనికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. తేనెతో అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. అయితే మీకు తెలుసా.. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. దీని వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక సీసాలో సగం వరకు ఖర్జూరాలను తీసుకోవాలి. వాటిల్లోని విత్తనాలను తీసేసి సీసాలో వేయాలి. అనంతరం ఖర్జూరాలు పూర్తిగా మునిగే వరకు వాటిపై తేనె పోయాలి. తరువాత వాటిని బాగా కలపాలి. అనంతరం ఆ సీసాకు మూత పెట్టేయాలి. ఇలా వారం రోజుల పాటు ఉంచాలి. దీంతో తేనెలో ఖర్జూరాలు బాగా నానుతాయి. ఇలా అయ్యాక ఖర్జూరాలను బయటకు తీసి రోజుకు 3 లేదా 4 చొప్పున తింటుండాలి. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇలా ఖర్జూరాలు, తేనె కలిపి తీసుకోవడం వల్ల రక్తం అధికంగా తయారవుతుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
కొందరు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచే నీరసంగా ఉందని.. ఏ పని చేయలేమని.. అలసిపోయామని చెబుతుంటారు. అలాంటి వారు ఉదయాన్నే తేనె, ఖర్జూరాల మిశ్రమం తింటే ఎంతో మేలు జరుగుతుంది. దీని వల్ల శరీరం ఉత్తేజంగా మారుతుంది. యాక్టివ్గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. ఎలాంటి అలసట ఉండదు. నీరసం రాదు. అలాగే ఈ రెండింటినీ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా అజీర్ణం, మలబద్దకం తగ్గుతాయి. అలాగే హైబీపీ తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్లు రావు.
ఇలా తేనె, ఖర్జూరాలను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. శక్తి, పోషకాలు రెండూ లభిస్తాయి. రోజంతా బద్దకంగా ఉండేవారు ఈ మిశ్రమాన్ని తింటే వెంటనే లేచి పరుగెడతారు. యాక్టివ్గా ఉంటారు. చిన్నారులు అయితే చదువుల్లో రాణిస్తారు. వారిలో ఎదుగుదల లోపాలు రావు. కనుక ఈ మిశ్రమాన్ని ప్రతి ఒక్కరూ రోజూ తీసుకోవాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…