Hema : నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దాల కాలం నుంచి హేమ టాలీవుడ్ లో కీలక పాత్రలలో నటిస్తూ అలరిస్తూ వచ్చింది. అయితే ఇటీవలి కాలంలో పలు వివాదాలతో వార్తలలో నిలుస్తూ వచ్చిన హేమ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్తతో ఉన్న వీడియోలు, ఫొటోలను ఫేక్ తంబ్నెయిల్స్తో యూట్యూబ్లో పోస్ట్ చేశారని ఈ ఫిర్యాదులో హేమ పేర్కొంది. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అసత్య ప్రచారం చేస్తోన్న యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో హేమ కోరింది.
మూడేళ్ల కిందట పెళ్లి రోజు వేడుకల సందర్భంగా భర్తతో ఉన్న ఫొటోలను ఇప్పుడు మరోసారి పోస్టు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని , దీనిపై తాను న్యాయపోరాటం చేసేందుకు కూడా వెనుకాడనని స్పష్టం చేశారు. సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేసే యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాలని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను కోరింది. కొందరు సినీ ప్రముఖులు బతికే ఉన్నప్పటికీ, వారు చనిపోయారంటూ డబ్బుల కోసం అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని హేమ ఆవేదన వ్యక్తం చేసింది. అందుకు ఉదాహరణగా కోట శ్రీనివాసరావు అంశాన్ని ప్రస్తావించారు. కోట ఇక లేరంటూ తప్పుడు ప్రచారం చేశారని చెప్పుకొచ్చింది.
నటి హేమ ప్రేమ వివాహం చేసుకున్న విషయం విదితమే. దూరదర్శన్లో నటించేటప్పుడు జాన్ కెమెరామేన్గా పనిచేశారని, ఆయనతో పరిచయం ప్రేమ ఏర్పడి పెళ్లిచేసుకుంటానని అడగడంతో తాను కూడా నో చెప్పలేకపోయానని అన్నారు. తనకు 18 నుంచి 19 ఏళ్ల మధ్యలోనే వివాహం జరిగిపోయిందన్నారు. అయితే, ఇంట్లో తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని ఓ సందర్భంలో చెప్పారు. హేమ కూతురు ఇషా కాగా, ఆమె వయసు ఇప్పుడు 22 ఏళ్లు. ఇటీవల కూతురితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టారు. ఇషా బీబీఏ పూర్తిచేసిందని సమాచారం.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…