Indra Movie : మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు రూపొందాయి. వాటిలో ఇంద్ర చిత్రం కూడా ఒకటి. బి.గోపాల్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మాణంలో తెరకెక్కిన ‘ఇంద్ర’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా విడుదలై 20 యేళ్లు పైన అవుతున్న ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక ముచ్చట వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. ఇంద్ర సినిమాలో సోనాలీబింద్రె, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. అప్పట్లో ఈ చిత్రం సృష్టించిన రికార్డులకు హద్దే లేదు. బాక్సాఫీస్ దగ్గర చెలరేగిపోయాడు మెగాస్టార్. తన కెరీర్లో తొలిసారి నటించిన ఫ్యాక్షన్ సినిమా ఇది.
ఈ బ్లాక్ బస్టర్ సినిమా కంటే ముందు చిరంజీవి హీరోగా వచ్చిన మృగరాజు సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా కంటే ముందు చిరు హీరోగా డాడీ సినిమా వచ్చింది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఇంద్ర సినిమా మాత్రం ఎన్నో రికార్డులని చెరిపేసింది. అప్పటి వరకు రాయలసీమ నేపథ్యంలో ఒక్క సినిమా కూడా చేయని చిరంజీవి.. తన కోసం ప్రత్యేకంగా ముచ్చటపడి మరీ ఇంద్ర కథను సిద్ధం చేయించుకున్నాడు. . చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఇంద్ర సెకండాఫ్లో చాలా సన్నివేశాలు చిరంజీవి స్వయంగా డైరెక్ట్ చేసాడు. ఈ విషయం కూడా ఎవరో చెప్పలేదు.. ఆ చిత్ర దర్శకుడు బి గోపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఇంద్ర చిత్రంలో ఓ తొప్పు దొర్లింది. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని మెగాస్టార్ చెప్పిన డైలాగ్….ఆయన మ్యానరిజం థియేటర్ లో క్లాప్స్ కొట్టించాయి. అయితే ఈ సినిమాలో దర్శకుడు చిన్న తప్పు చేశాడు. సినిమాలో హోలీ పండుగ జరుగుతుంది. అయితే అదేరోజు సినిమాలో చిరంజీవి సిస్టర్స్ వచ్చి రాఖీ కడతారు. అలా రెండు పండుగలను ఒకే రోజు చూపించి దర్శకుడు మిస్టేక్ చేశాడు. ఈ విషయం తర్వత గుర్తించిన నెటిజన్స్ తెగ ట్రోల్స్ చేశారు.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…