Harish Rao : ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయం మరింత వేడెక్కిస్తున్నారు. రీసెంట్గా తెలంగాణ మంత్రి హరీష్ రావు.. మోదీతో పాటు జగన్పై కూడా మండిపడ్డారు. మోదీ వచ్చి పెద్ద నీతులు చెప్పే ప్రయత్నం చేశారన్నారు. మోదీ ది పూటకో మాట.. రాష్ట్రానికో మాట చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్ అద్భుతంగా పని చేస్తున్నాడని పార్లమెంట్లో చెప్పారన్నారు. కేసీఆర్ ఎప్పుడు వచ్చినా నీళ్లు, ప్రాజెక్టులు, కరెంటు అభివృద్ధి గురించి మాట్లాడితే… ఏపీ నాయకుడు కేసుల గురించి మాట్లాడతారని పార్లమెంట్ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు.
ఢిల్లీలో ఒక మాట, తెలంగాణ గల్లీల్లో ఒక మాట అంటున్నారని మండిపడ్డారు. నిన్న కాక మొన్న కర్ణాటకలో దేవెగౌడ్తో పొత్తు పెట్టుకున్నావ్… అక్కడ ఏం చెప్తావ్ అని ప్రశ్నించారు. జ్యోతిరాదిత్య సిందియా, అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్ ఎవరు… సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్గా రాలేదు ప్రజలు లక్ష ఓట్లతో గెలిపిస్తే ప్రజాక్షేత్రం నుంచి వచ్చి పని చేస్తున్నామని తెలిపారు. ‘‘మీ మాదిరి రాజ్యసభ, మంత్రి పదవులు మాకు కేసీఆర్ ఇవ్వలేదు… ఉద్యమం చెయ్యమని చెప్పాడు. పోరాటాలు, ఉద్యమాలు, జైలుకు పోయినం. మీరు నామినేటెడ్ పదవులు ఇచ్చి కేంద్ర మంత్రి పదవులు ఇస్తున్నారు. ప్రధాన మంత్రి స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎన్నికలు వస్తున్నాయని రాజకీయం కోసం మాట్లాడడం చాలా దురదృష్టకరం. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బీ టీం’’ అని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు.
తెలంగాణలో బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ వచ్చేది లేదు. పాలమూరు ప్రాజెక్టుకు కృష్ణా నీటి కేటాయింపుకి అడ్డుపడుతున్న బీజేపీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నారంటా, తెలంగాణను కూడా అమ్ముకుంటారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన ఓటు వేస్ట్ చేసుకోవడమే. బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారు. కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడానికి అభ్యర్థులు లేకా, బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టిన వాళ్లను తీసుకొని అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు.” అని హరీష్ రావు అన్నారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…