Harish Rao : జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు.. కేసీఆర్‌ని ఓడిస్తే హైద‌రాబాద్ అమ‌రావ‌తిలా మారుతుందంటూ..

Harish Rao : ఎల‌క్ష‌న్స్ ద‌గ్గ‌ర‌కి వ‌స్తున్న నేప‌థ్యంలో తెలంగాణ‌లో కేసీఆర్, కేటీఆర్, హ‌రీష్ రావు తెలంగాణ‌లో తెగ ప‌ర్య‌టిస్తున్నారు. విప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేస్తూ ఈ సారి కూడా అధికారం త‌మ‌కి ద‌క్కేలా ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నారు. నాడు కరెంటు ఉంటే వార్త… నేడు తెలంగాణ లో కరెంటు పోతే వార్త అని మంత్రి హరీష్ రావు అన్నారు. 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలన్నారు. బీజేపీ వాళ్ళు కరెంటుకు మీటర్లు పెట్టాలని, బిల్లులు వసూలు చేయాలని అంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ మాత్రం ఒప్పు కోవడం లేదని.. అందుకే రాష్ట్రంపై కేంద్రం అక్కసు పెంచుకుందన్నారు.

బీఆర్ఎస్ పథకాలను కాంగ్రెస్ కాపీ కొట్టిందన్నారు. రైతు బంధు సృష్టికర్త కేసీఆర్ అని.. అలాంటి రైతులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. ఖానాపూర్‌లో జాన్సన్‌ను గెలిపించాలని హరీష్ రావు కోరారు. జాన్సన్ తమ కుటుంబ సభ్యుడని.. అభివృద్ధి పూచీ తమదని అన్నారు. పోడు పట్టాలు రాని రైతులకు కూడా రైతు బంధు ఇస్తామన్నారు. బీజేపీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేనే సీఎం, కాదు నేనే సీఎం అంటూ చాలామంది తమ మనసులో మాట బయటపెడుతున్నారు. రేసులో నేను కూడా ఉన్నానంటూ నాయకులు తమ పేర్లు తామే చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సీఎం అభ్యర్థులపై సెటైర్లు పేల్చారు.

Harish Rao comments on cm ys jagan
Harish Rao

ఆ పార్టీలో కుర్చీల కొట్లాటలు ఎక్కువ, ప్రయోజనాలు తక్కువ అని ఎద్దేవా చేశారు. జగ్గారెడ్డి, జానారెడ్డి సహా చాలామంది సీఎం కావాలని కలలు కంటున్నారని.. పొరపాటున ఆ పార్టీ అధికారంలోకి వస్తే కొట్లాటలు, కుట్రలు, కర్ఫ్యూలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఏపీలో ఓడించి జ‌గ‌న్‌ని గెలిపిస్తే అమ‌రావ‌తి ఎలా అయిందో ఇప్పుడు కేసీఆర్‌ని ఓడిస్తే కూడా హైద‌రాబాద్ అలా అవుతుందంటూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. ఇటీవ‌లి కాలంలో తెలంగాణ నాయ‌కులు జ‌గ‌న్ ప్ర‌భుత్వంతో పాటు ఆ పార్టీకి చెందిన వారిపై విమ‌ర్శ‌లు కురిపిస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలయిన విషయం తెలిసిందే. నవంబర్ 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నవంబర్ 10 లోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. నవంబర్ 30న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న తేదీన కౌంటింగ్ జరిపి, అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

13 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago