గీతా సింగ్ అంటే వెంటనే మనకు గుర్తుకు రాకపోవచ్చు. కాని కితకితలు హీరోయిన్ అంటే వెంటనే గుర్తు పట్టేస్తారు. ఈ అమ్మడు ఎవడి గోల వాడిదే, పోటుగాడు, శశిరేఖా పరిణయం, సీమ టపాకాయ్ వంటి ఎన్నో చిత్రాల్లో తనదైన కామెడీతో మెప్పించింది. కితకితలు సినిమాలో అల్లరి నరేష్ సరసన ఆమె నటించగా, ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఆమె జీవితంలో ఎన్నో బాధాకర సంఘటనలు ఉన్నాయి. పలు సందర్భాలలో వాటి గురించి చెబుతూ చాలా బాధపడింది గీతా సింగ్ . తనను అయిన వాళ్లే డబ్బు కోసం వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారని, నమ్మినవాళ్లు దారుణంగా మోసం చేశారని బాధ పడ్డారు.
ఒకరి దగ్గర చిట్టీలు వేస్తే అతను ఏకంగా రూ. 6 కోట్లు మోసం చేశాడని ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పారు. సినిమాల్లో అవకాశాలు రాకపోవటంతో రెండుసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని అయితే తన స్నేహితురాలు అండగా నిలబడటంతో తట్టుకోగలిగానని ఆమె అన్నారు. తను కితకితలు హీరోయిన్ గా చేసిన తరువాత కమెడియన్ గా చాలా సినిమాలు చేశానని చెప్పుకు రాగా, ఓ సారి షూటింగ్ లో ఇద్దరు హీరోయిన్లు తనను అవమానించారని. వారు ధారుణంగా మాట్లాడారని వెల్లడించింది. నా గురించి హీరోయిన్ ఏంటని చీప్గా మాట్లాడితే.. అప్పుడు అల్లరి నరేష్ ఆ హీరోయిన్లముందే .. తను నా ఫస్ట్ హీరోయిన్ అంటూ పరిచయం చేశాడని చెప్పింది గీతా సింగ్. దాంతో వారు ఆశ్చర్యపోవడంతో పాటు.. షాక్ కు గురయ్యారట.
ఇటీవల పెద్దగా కనిపించకపోవడంతో స్పందించిన గీతా సింగ్.. ఇండస్ట్రీలో ఇప్పుడు అసలు ఫీమేయిల్ ఆర్టిస్ట్ లకు పెద్దగా ఛాన్స్ లు లేవు అంటుంది. పురిషాధిక్యం పెరగడంతో..మా లాంటివారిని అసలు చూడటం లేదు అంటోంది గీతాసింగ్. ప్రస్తుతం తన అన్నయ్య పిల్లలను దత్తత తీసుకున్నానని, వారితోనే కలిసి ఉంటున్నానని చెప్పింది. తాను వివాదాలకు దూరంగా ఉంటానని, తన పనేదో తాను చేసుకుని వెళ్లిపోతానని కూడా ఆమె చెప్పారు.