Dry Ginger With Milk : ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా శ్రద్ద పెట్టాలి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు శొంఠి పొడి కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శొంఠి పొడి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. శొంఠి పొడిలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి వాటి నుండి ఉపశమనం కలుగుతుంది, అంతేకాకుండా గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది.
ఈ పొడి శరీరంలోని విషాలను బయటకు పంపుతుంది. బరువు తగ్గడానికి, శరీరంలోని కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ఎక్కిళ్ళు వస్తే ఒక పట్టాన తగ్గవు. అలాంటప్పుడు ఈ శొంఠి పాలను తాగితే ఎక్కిళ్లు తగ్గుతాయి. శొంఠి పొడిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు ఉండడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల సమస్య ఉన్నవారు ప్రతి రోజూ ఇలా తాగితే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ పాలను ప్రతి రోజూ కాకుండా వారంలో మూడు సార్లు తాగితే మంచిది. శొంఠి పొడి మార్కెట్లో లభ్యం అవుతుంది. అలా కాకుండా మనం శొంఠి కొమ్ములను తెచ్చుకుని నూనె లేదా నేతిలో వేయించి పొడిగా తయారు చేసుకుంటే చాలా మంచిది. మంచి ఫ్లేవర్ తో వస్తుంది. దీన్ని తీసుకుంటే ఇంకా ఎక్కువ మొత్తంలో ఫలితం కలుగుతుంది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…