Krishnam Raju Daughters : తెలుగు సినీ పరిశ్రమలో వర్సటైల్ యాక్టర్గా గుర్తు తెచ్చుకున్నాడు కృష్ణం రాజు. దాదాపు 180కి పైగా సినిమాలు చేసి రెబల్ స్టార్గా తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. కృష్ణంరాజు ఆకస్మిక మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణం రాజు మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని కొందరు తమ ఆవేదన వెళ్లబుచ్చారు. అయితే కృష్ణం రాజు మృతి తర్వాత ఆయన ఫ్యామిలీకి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణం రాజు రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడని, మొదటి భార్య యాక్సిడెంట్లో మృతి చెందిందని సమాచారం.
కృష్ణంరాజు.. విజయనగర సామ్రాజ్య వారసులు. అందుకే వారి పేరు వెనకాల రాజు అనేది ఉంటుంది. వీరికి అనేక ఆస్తులున్నాయి. వేల ఎకరాల భూములున్నాయి. కోట్ల ఆస్తులు ఉన్నా కూడా సినీ రంగంపై ఉన్న ఆసక్తితోనే ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెబల్ స్టార్ అనే పేరు తెచ్చుకున్నారు. కృష్ణంరాజుకు కొన్ని కోరికలు ఉండేవి. భక్త కన్నప్ప చిత్రాన్ని ప్రభాస్ తో రీమేక్ చేయాలనుకున్నారు. అలాగే.. విశాలనేత్రాలు, జీవన తరంగాలు నవల ఆధారంగా సినిమాలు తీయాలనుకున్నారు. ప్రభాస్ పెళ్లి చూడాలని, పిల్లలతో కలిసి సరదాగా ఆడుకోవాలని అనుకునేవారు. కానీ అవన్నీ తీరకుండానే కన్నమూశారు.
కృష్ణం రాజుకి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారు సినీ పరిశ్రమకు చాలా దూరంగానే ఉంటారు. పెద్ద అమ్మాయి ప్రసీద లండన్లో ఎంబీఏ పూర్తి చేసింది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంతో నిర్మాతగా మారింది. ఇక రెండో అమ్మాయి ప్రకీర్తి హైదరాబాద్లోని జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్ చదువుతోంది. మూడో అమ్మాయి ప్రదీప్తి సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఇక కృష్ణం రాజు మొదటి భార్యకి ఓ కూతురు ఉండగా, ఆమె కూడా కృష్ణంరాజుతోనే కలిసి ఉంటుందట.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…