Director Geetha Krishna : ఒకప్పుడు టాలీవుడ్ లో అదిరిపోయే సినిమాలు తీసి టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు గీతాకృష్ణ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చాలా ఏళ్ల క్రితమే సినిమాలు తీయడం మానేసిన ఈయన ఈ మధ్య ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. 1987లో సంకీర్తన అనే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన గీతా కృష్ణ తన మొదటి చిత్రంతోనే దర్శకుడి ఉత్తమ మొదటి చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాడు. ఆ తర్వాత కోకిల, కీచురాళ్లు, ప్రియతమా, సర్వర్ సుందరం గారి అబ్బాయి, కాఫీబార్ వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాలను తెరకెక్కించాడు. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళంలో కూడా టైం, నిమిడంగల్ అనే సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక ఆ తర్వాత నుంచి ఆయన సినిమాలు చేయలేదు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దేవర, తండేల్ సినిమాలు ఒక సమయంలో విడుదల కానున్నాయి… పోటీ ఎలా ఉండబోతుందని అడిగారు. దీనికి డైరెక్టర్ గీతా కృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ గ్రేట్ యాక్టర్ అని ఆయన సినిమాకు నాగ చైతన్య సినిమాకు పోటీ ఏంటని అన్నారు. అలాగే నాగ చైతన్య అప్ కమింగ్ హీరో అని.. ఆయనకు సరిగ్గా నటించడం కూడా రాదంటూ చెప్పుకొచ్చారు.ఇక విజయ్ దేవరకొండ గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన తన గురించి గొప్పలు చెప్పుకోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఆయన రెమ్యునరేషన్ ఆయన తీసుకుంటున్నారు. దర్శకుడికి నిర్మాతలకే నష్టం అని చెప్పుకొచ్చాడు గీతా కృష్ణ.
విజయ్ దేవరకొండ తన సినిమాలు వంద కోట్లు వసూళ్లు చేస్తుందని ఎందుకు గొప్పలు చెప్పుకోవడం, సినిమానే నిరూపిస్తుందిగా లేని పోని మాటలు చెప్పి నెగెటివిటీని ఎందుకు మూటగట్టుకోవడం అంటూ గీతా కృష్ణ తనదైన శైలిలో పంచ్లు వేశారు. గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో వచ్చింది ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించిన కూడా ఎక్కువగా నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. అదంతా విజయ్ దేవరకొండ వల్లనే జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.