Dil Raju : టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.ఆయన చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలని నిర్మిస్తూ మంచి హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవల తన కుమారుడి మొదటి పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్గా నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో జరిగిన అన్వై బర్త్ డే వేడుకలకు పలువురు సినీ ప్రముఖు హాజరయ్యారు. దిల్రాజు కుటుంబ సభ్యులతో పాటు మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతులు, మహేశ్ బాబు, వెంకటేశ్, గోపీచంద్, శ్రీలీల, రాశీఖన్నా, సురేష్ బాబు, త్రివిక్రమ్, వక్కంతం వంశీ తదితరులు ఈ ఫంక్షన్కు హాజరయ్యారు.
వేడుకకి హాజరైన సెలబ్స్ ..అన్వైను ఆశీర్వదించారు. కాగా తన కుమారుడి బర్త్డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రూపొందించారు దిల్రాజు. ఇందుకోసం మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ప్రత్యేకంగా ఓ పాటను కూడా కంపోజ్ చేశాడు. ప్రముఖ సింగర్ కార్తిక్ ఈ పాటను ఆలపించారు. ఇటీవలే యూట్యూబ్లోకి వచ్చిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. దిల్ రాజు, ఆయన సతీమణితో పాటు కుటుంబ సభ్యులు అన్వైతో సరదాగా గడిపిన క్షణాలను ఈ వీడియోలో మనం చూడవచ్చు. ముఖ్యంగా దిల్రాజు తనయుడిపై మనవడు నీళ్లు పోస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మూడేళ్ల క్రితం తేజస్విని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి గతేడాది అన్వై అనే జన్మించాడు. దిల్ రాజు నివాసంలో ఆయన కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కాగా దిల్రాజు సతీమణి 2017లో కన్నుమూశారు. ఆ తర్వాత 2020లో తేజస్వినిని రెండో వివాహం చేసుకున్నారాయన. వీరికి 2022 జూన్ 29న అన్వై పుట్టాడు. ఇటీవల బలగం సినిమాతో మంచి హిట్ అందుకున్న దిల్ రాజు ప్రస్తుతం రామ్ చరణ్తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మిస్తున్నారు . ఇందులో ఎస్ జే సూర్య విలన్గా కనిపించనున్నారు. అంజలి, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…