CM YS Jagan : వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఘోరంగా అవమానించారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఈ ఘటన చోటుచేసుకోగా, ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హస్తిన పర్యటనలో ఉన్న జగన్కు పార్లమెంట్ ఆవరణలో మాగుంట పలకరించి షేక్ హ్యాండ్ ఇవ్వబోయారు.. అంటీముంటన్నట్లుగానే జగన్ వ్యవహరించారు. సీఎంను చూడగానే.. ఇప్పటి వరకూ జరిగిందేదో జరిగిందని ఎంతో మర్యాదపూర్వకంగా నమస్కరించి, చేతులు కలపగా అబ్బే అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చారు.
కాస్త హర్ట్ అయిన మాగుంట.. కనీసం జగన్ వెంట పార్లమెంట్ లోనికి వెళ్లడానికి సాహసించలేదు. వైఎస్ జగన్ వెంట.. ఎంపీలు విజయసాయిరెడ్డి వంగా గీత మరికొందరు ఎంపీలు మాత్రమే వెళ్లారు. జగన్ పార్లమెంట్ మెట్లు ఎక్కుతుండగా ముందుకెళ్లాలని ప్రయత్నించినప్పటికీ ఎందుకో వెళ్లలేకపోయారు. అయితే ఈ గ్యాప్లో.. ప్రధాని మోదీతో భేటీ అనంతరం మాగుంట గురించి విజయసాయితో ప్రత్యేకంగా మాట్లాడినట్లు సమాచారం. ‘మేం ఎవరూ ఆయన్ను పిలవలేదు.. ఆయన ఎందుకొచ్చారో కూడా మాకు తెలియదు..?’ అని జగన్కు సాయిరెడ్డి బదులిచ్చినట్లుగా సమాచారం. ఈ మాటలు విన్న జగన్.. ‘ఏంటిది చూస్కోవాలిగా సాయన్నా.. అన్నీ తెలిసిన నీ ఆధ్వర్యంలో ఇలా జరగడమేంటి..?’ అని ఒకింత అసహనం వెలిబుచ్చినట్లుగా సమాచారం.
![CM YS Jagan : వైసీపీ ఎంపీ మాగుంటని ఘోరంగా అవమానించిన జగన్.. ఏంటి ఈ ఘోరం..! CM YS Jagan vs magunta what happened really](http://3.0.182.119/wp-content/uploads/2024/02/cm-ys-jagan-1.jpg)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ను బూతులు తిట్టాలని.. అలాగే ఒంగోలు ఎంపీ టికెట్ కోసం కోట్లు తీసుకుని రావాలని మాగుంటకు వైఎస్ జగన్ అల్టిమేటం జారీచేశారట. అయితే.. ఈ రెండు పనులూ చేయడానికి మాగుంట సిద్ధంగా లేరట. ఒకట్రెండు రోజులు చూసిన జగన్.. ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయనపై కోపం పెంచుకుని అసలు మాగుంట పార్టీకి అవసరం లేదని పక్కనెట్టేశారని వార్తలు గుప్పుమంటున్నాయి. తనకు జరిగిన అన్యాయం తెలుసుకున్న మాగుంటి తన కుమారుడు రాఘువరెడ్డితో కలిసి.. టీడీపీలో చేరాలని సన్నాహాలు చేస్తున్నారు మాగుంట. ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది.